Last Updated:

Minister KTR: రూ.18 వేల కోట్లు మునుగోడు కోసం ఖర్చు చేస్తే.. ఎన్నికల నుంచి తప్పుకుంటాం.. కేటీఆర్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు రూపంలో దక్కించుకున్న రూ. 18 వేల కోట్లను మునుగోడు ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇస్తే.... తాము మునుగోడు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Minister KTR: రూ.18 వేల కోట్లు మునుగోడు కోసం ఖర్చు చేస్తే.. ఎన్నికల నుంచి తప్పుకుంటాం.. కేటీఆర్

Hyderabad: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు రూపంలో దక్కించుకున్న రూ. 18 వేల కోట్లను మునుగోడు ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇస్తే, తాము మునుగోడు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికలను మోడీ, అమిత్ షా అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటంగా అభిర్ణించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మార్చి, తమ పథకాలుగా చెప్పుకుంటున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ నాయకులు నోరు తెరిస్తే గుజరాత్ మోడల్ అంటున్నారని, వాస్తవానికి అదొక బేకార్ మోడల్ అని మంత్రి విమర్శించారు. తెలంగాణ బెస్ట్ అంటూ ఓ వైపు అవార్డులు ఇస్తూ, మరోవైపు విమర్శించడం సరికాదని హితవు పలికారు.

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించడం పక్కా అని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో ఫ్లోరిన్ సమస్య లేకుండా పారదోలామని, ప్రజలు తమకు ఓటు వేయడానికి ఈ ఒక్క కారణం చాలు అని అన్నారు. ఉత్తమ మున్సిపాలిటీగా చండూరు కేంద్రం నుంచి అవార్డ్ పొందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే 49 వేల మందికి రైతు బంధు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు.

105 అసెంబ్లీ సీట్లున్న టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కోల్పోయినంత మాత్రాన పోయేదేమీ లేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న కేసీఆర్. ఇప్పుడు దేశం కోసం బయలుదేరితే బీజేపీ నాయకుల్లో భయం మొదలైందన్నారు. కోమటి రెడ్డిలు కాదు కోవర్ట్ రెడ్డిలు అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ పై కేటీఆర్ సెటైర్లు వేసారు.

ఇవి కూడా చదవండి: