Home / ప్రాంతీయం
వివాదాస్పద వ్యాఖ్యలు చేష్టలతో నిత్యం వార్తల్లో ఉండే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్ళీ తెరకెక్కారు. ఎమ్మెల్యే రాజయ్య తనని లైంగికంగా వేధించారని గతంలో సంచలన ఆరోపణలు చేసిన జానకీపురం సర్పంచ్ నవ్య మళ్ళీ మీడియా ముందుకి వచ్చారు
తెలంగాణ ఉద్యమాన్ని తన ఆత్మబలిదానంతో కీలక మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మని ఎట్టకేలకు బిఆర్ఎస్ అధిష్టానం కరుణించినట్లే కనిపిస్తోంది. ఇంతకాలం శంకరమ్మని పట్టించుకోకుండా పక్కనబెట్టిన బిఆర్ఎస్ అధిష్టానం తాజాగా ఆమెని రేపు హైదరాబాద్కి రావాలని పిలిచింది.
Gaddar: తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ప్రజాగాయకుడు గద్దర్ పేరు తెలియని వారుండరు. తన పాటల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ ఉండే గద్దర్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గద్దర్ ప్రజా పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. పార్టీలో చేరికలపై సమాలోచనలు చేశారు. ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైన వేళ రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి భేటీ ప్రాధాన్యతని సంతరించుకుంది.
Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో అర్థరాత్రి వేళ ఓ ఘోర ప్రమాదం జరిగింది. సాగర్ రింగ్ రోడ్ వద్ద బైరమలగూడలో నిర్మాణ దశలో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
భారతదేశంలో ముస్లింలు ఏనాటికీ మైనారిటీలు కారని, ఈ దేశం మనందరిదీ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ముస్లింల భద్రత, గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా జనసేన పార్టీ చూసుకుంటుందని చెప్పారు. వారాహి విజయయాత్రలో భాగంగా మంగళవారం కాకినాడలో పవన్ కళ్యాణ్ ముస్లిం ప్రతినిధులతో సమావేశమయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల లోన్కు అప్లై చేసుకునేందుకు బీసీలు తిప్పలు పడుతున్నారు. క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తహశీల్దార్ ఆఫీసులు, మీ సేవా సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మండిపడ్డారు. ముద్రగడని ఇంతకాలం పెద్ద మనిషి అనుకున్నానని, పవన్ కళ్యాణ్పై ఎక్కుపెట్టిన బాణాలతో ముద్రగడపై ఉన్న నమ్మకానికి తూట్లు పొడిచినట్లైందని జోగయ్య విమర్శించారు.
బాలికలు, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు అంతం లేకుండా పోతుంది. వయస్సుతో కూడా సంబంధం లేకుండా వారిపై దాడులు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రస్తుతం ఎవర్ని నమ్మాలో కూడా తెలియని అగమ్యగోచరమైన పరిస్థితుల్లోకి బాలికలు, యువతులు, మహిళలు వెళ్తున్నారని అనడంలో సందేహం లేదు.
ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ మరింత వేడుక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ యాత్రలో తనదైన శైలిలో అధికార వైసీపీపై పవన్ విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. పవన్ కళ్యాణ్ కి లేఖ రాయడం తీవ్ర