Home / తాజా వార్తలు
ఎట్టకేలకు ఆరెంజ్ ఆర్మీ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. మూడేళ్ల తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. హైదరాబాద్ ప్లేఆఫ్స్కు చేరింది.
నెల రోజుల నుంచి కొనసాగుతున్న గంగవరం పోర్టు కార్మికుల సమ్మె ఒక కొలిక్కి వచ్చింది. కార్మికులు శుక్రవారం నుంచి విధుల్లోకి వెళ్ళుతున్నారు . తమ జీతాలు పెంచాలని పోర్ట్ లోని నిర్వాసిత కార్మికులు ఏప్రిల్ 15 న సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే
అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన జేపీ మోర్గాన్స్, సిటి బ్యాంకులాంటి అతి పెద్ద బ్యాంకులు ఇండియాకు కూడా కావాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం శుక్రవారం చెప్పారు. ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ముంబైలో గత సోమవారం సాయంత్రం ఘాట్కోపర్ ప్రాంతంలో అతి పెద్ద హోర్డింగ్ కూలి సుమారు 16 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ముంబై పోలీసులు అడ్వర్టజింగ్ ఏజెన్సీ డైరెక్టర్ భావేష్ భిండేను గురువారం నాడు ఉదయ్పూర్లో అరెస్టు చేశారు. ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ హోర్డింగ్ కాంట్రాక్టు దక్కించుకుంది.
ఉన్నత విద్యకు కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థులను తిరిగి వెనక్కిపంపేందుకు కెనడా ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రాంతంలో విద్యార్థులు శుక్రవారం నాడు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. తమను బలవంతంగా ఇండియాకు పంపవద్దని ప్రభుత్వానికి వారు మొరపెట్టుకుంటున్నారు.
అరవింద్ కేజ్రీవాల్కు చెందిన ఆమ్ ఆద్మీపార్టీలో ఆల్ ఈజ్ నాట్ వెల్గా ఉంది. ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలీవాల్ ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ఆయన పర్సెనల్ సెక్రటరీ బైభవ కుమార్ ఆమెపై దాడి చేశాడు. దీంతో మలీవాల్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. పో
హైదరాబాద్ మధురానగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భర్తను కాదని ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య చివరికి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు కిరాయి రౌడీలను కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. మరో వైపు అగ్రనేతలు మాత్రం యాత్రలకు బయలుదేరారు . ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా తీర్థయాత్రలు చేస్తున్నారు. మహారాష్ట్ర లోని పుణ్య క్షేత్రాలను చుడుతున్నారు
ఏపీలో ఎన్నికల సందర్భంగా ,ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే .
హైదరాబాద్ శివారు కూకట్ పల్లిలో విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ ఎస్ఓటీ, కూకట్ పల్లి పోలీసులు సంయుక్తంగా దాడిచేసి శేషాద్రినగర్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వారివద్ద నుంచి మూడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.