Home / తాజా వార్తలు
వైసీపీ ఓటమి..కూటమి విజయం ఖాయమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో వారాహి విజయ భేరి సభలో సీఎం జగన్ పై పవన్ విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు లేరని..అంతా కుటుంబ సభ్యుల్లా పనిచేసుకుంటున్నామన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు.
భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా గ్రూపు టేకోవర్ చేసి ప్రస్తుతం లేనిపోని ఇబ్బందులు పడుతోంది. సిబ్బంది కొరతతో విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు చివరి నిమిషంలోవిమానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఎయిర్ ఇండియా యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఈ సారి అధికారంలోకి వస్తే.. ఏడాదికి ఒక ప్రదానిని తీసుకువస్తారని అన్నారు. ఐదు సంవత్సారాలలో ఐదు మంది ప్రధానలు మారుతారు . అంటే దేశ ప్రగతిని అధోగతి పాలు చేయబోతున్నారని ప్రధాని విమర్శించారు. వరంగల్లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి సామ్ పిట్రోడాతో తలనొప్పులు తగ్గేట్లు లేవు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ సామ్ పిట్రోడా ఇటీవలే ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారసత్వపన్నును అమల్లోకి తెస్తామని ప్రకటించి పెద్ద దుమారం రేపారు. దీన్ని బీజేపీ తమకు అనుకూలంగా మలచుకుంది.
మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో.. ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో.. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తుపై సుప్రీంకోర్టులో మంగళవారం వాదోపవాదాలు జరిగాయి. లోకసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.
:జార్ఖండ్ మంత్రి అలమ్గిర్ ఆలమ్ సెక్రటరీ నుంచి ఈడీ అధికారులు ఏకంగా రూ.30 నుంచి రూ.40 కోట్లు వసూలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేవలం రూ.10వేల లంచం కాస్తా రూ.30 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది.
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. మే13న లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల సంఘానికి ఎన్. వేణుగోపాల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసారు. దీనిపై ఎన్నికల సంఘం రైతు భరోసా చెల్లింపులను వాయిదా వేయాలని పేర్కొంది.
మన దేశంలో భర్తలు భార్యలను చిత్రహింసలకు గురి చేసే ఘటనలు కొకొల్లలు.. అదే భార్య భర్తను చిత్ర హింసలకు గురి చేసే ఘటనలు ఎప్పుడో అసాధారణంగా చోటు చేసుకుంటాయి. ఒక వేళ తన భార్య తనను టార్చర్ చేస్తోందని చెప్పినా.. ఎవరూ నమ్మరు... కావాలనే భార్యపై అపవాదు వేస్తున్నాడని భర్తనే అనుమానించడం మన దేశంలో సహజం.