Last Updated:

Srivari Brahmotsavalu: ఈ నెల 27నుంచి శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు.

సెప్టెంబరు 27వ తేదీ నుండి అక్టోబరు 5వ తేదీ వ‌ర‌కు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు తెలిపారు. అదేవిధంగా సెప్టెంబరు 20వ తేదీన‌ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 26న అంకురార్పణ, అక్టోబర్ 1న గరుడ సేవ ఉంటుంద‌న్నారు.

Srivari Brahmotsavalu: ఈ నెల 27నుంచి శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు.

Srivari Brahmotsavalu: సెప్టెంబరు 27వ తేదీ నుండి అక్టోబరు 5వ తేదీ వ‌ర‌కు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు తెలిపారు. అదేవిధంగా సెప్టెంబరు 20వ తేదీన‌ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 26న అంకురార్పణ, అక్టోబర్ 1న గరుడ సేవ ఉంటుంద‌న్నారు.

కొవిడ్ కార‌ణంగా రెండేళ్ల‌పాటు ఆల‌యంలో ఏకాంతంగా బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈసారి మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నుండ‌డంతో విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉంద‌ని టీటీడీ అంచ‌నా వేస్తోంది. ఈ క్ర‌మంలో భ‌క్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతోంది.

ఇవి కూడా చదవండి: