Last Updated:

Adipurush: ‘ఆదిపురుష్’ కొన్ని సీన్లు రీషూట్ చేస్తారా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా చెప్పిన సమయానికి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.

Adipurush: ‘ఆదిపురుష్’ కొన్ని సీన్లు రీషూట్ చేస్తారా?

Tollywood: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా చెప్పిన సమయానికి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. దీని గురించి మేకర్స్ అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ, ఈ చిత్రం కొద్దిగా రీ-షూట్‌కు కూడా వెళ్లే అవకాశం ఉందని ఇప్పుడు ఒక టాక్ వినిపిస్తోంది.

ఆదిపురుష్ టీజర్‌లోని విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యత పై సినీ ప్రేమికులు మరియు అభిమానులు భారీగా ఫిర్యాదు చేయడంతో, సినిమా కంప్యూటర్‌లో రూపొందించిన గ్రాఫిక్స్‌కు నాణ్యమైన పనిని జోడించడానికి మేకర్స్ ఇప్పుడు విడుదల తేదీని వాయిదా వేసినట్లు చెబుతున్నారు. కొన్ని సన్నివేశాల కోసం, గ్రాఫిక్స్‌ పై రీవర్క్ చేస్తున్న విఎఫ్ఎక్స్ బృందం, ప్రభాస్ ఫుటేజీని కూడా మరలా రీ-షూట్ చేయాలనుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీగా ఉన్నారు. తన షెడ్యూల్స్ అన్నీ బుక్ అయిపోయాయి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ‘సలార్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు ప్రభాస్. రామోజీ ఫిలిం సిటీలో స్పెషల్ గా వేసిన సెట్ లో సినిమా షూటింగ్ జరుగుతుంది. దీంతో పాటు ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొనాల్సి ఉంది. మరోపక్క మారుతి సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాలన్నీ పక్కన పెట్టి ‘ఆదిపురుష్’ రీషూట్ లో ప్రభాస్ పాల్గొంటారేమో చూడాలి. ఇక ఈ సినిమాలో కృతిసనన్, సైఫ్ అలీఖాన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో టీసిరీస్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది.

ఇవి కూడా చదవండి: