Last Updated:

Neet Exam 2023 : నీట్‌ ఎగ్జామ్ కు సర్వం రెడీ.. విద్యార్ధులు పాటించాల్సిన నియమాలు ఏవంటే ?

దేశ వ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కొరకు నిర్వహించే నీట్ (NEET) పరీక్షకు అంతా సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 499 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ( మే 7, 2023 ) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇందుకు గాను మధ్యాహ్నం

Neet Exam 2023 : నీట్‌ ఎగ్జామ్ కు సర్వం రెడీ.. విద్యార్ధులు పాటించాల్సిన నియమాలు ఏవంటే ?

 Neet Exam 2023 : దేశ వ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కొరకు నిర్వహించే నీట్ (NEET) పరీక్షకు అంతా సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 499 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ( మే 7, 2023 ) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇందుకు గాను మధ్యాహ్నం 1.30 తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని అధికారులు వెల్లడించారు. కావున అభ్యర్ధులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని వారు సూచించారు.

తెలుగుతో సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించే నీట్‌ పరీక్షకు దేశవ్యాప్తంగా 18 లక్షల మంది హాజరవుతున్నారు. ఏపీలో 265 కేంద్రాల్లో నీట్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. విదేశాల్లో సైతం పరీక్ష రాసే విద్యార్థుల కోసం 14 చోట్ల నీట్​ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో 22 పరీక్ష కేంద్రాల్లో నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి 50 వేల మందికిపైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తున్నారు. పరీక్ష నిర్వహణా సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఇప్పటికే NEET 2023 అడ్మిట్‌ కార్డులను కూడా విడుదల చేసింది. కాగా పరీక్ష రాసే విద్యార్థులు పాటించాల్సిన నియమాలు ఎంతో మీకోసం ప్రత్యేకంగా..

(Neet Exam 2023) విద్యార్ధులకు సూచనలు..

  • నీట్ యూజీ 2023 పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు హాల్‌ టిక్కెట్‌తో పాటు ఆధార్‌ కార్డు, లేదా పాన్‌ కార్డ్‌, ఓటర్‌ ఐడీ లాంటి.. ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్​ను తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తీసుకురావాలని అధికారులు సూచించారు.
  • రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు సైతం తప్పనిసరిగా తీసుకెళ్ళాల్సి ఉంటుంది.
  • పేపర్లు, జామెట్రీ/పెన్సిల్‌ బాక్సులు, ప్లాస్టిక్‌ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేళ్లు, రైటింగ్‌ ప్యాడ్స్‌, పెన్‌డ్రైవ్స్‌, ఎలక్ట్రానిక్‌ పెన్నులు వంటి వాటిని పరీక్ష కేంద్రానికి అనుమతించరు.
  • పరీక్షా కేంద్రాల్లోకి వాచ్‌లు, బ్రాస్​లెట్, బంగారు ఆభరణాలు, ఫుడ్​ ఐటెమ్స్, వాటర్​ బాటిల్స్‌ని అనుమతించరు.
  • పొడవు చేతుల దుస్తులను సైతం వేసుకోకపోవడమే మంచిది.
  • వాలెట్లు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, బెల్టులు, టోపీలు వంటివి ధరించకూడదు.
  • మొబైల్‌ పోన్లు, బ్లూటూత్‌లు, ఇయర్‌ ఫోన్లు, పేజర్స్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు లోనికి అనుమతించరు.
  • సాంప్రదాయ దుస్తులు, వస్తువులతో వస్తే కనీసం రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి రావాలని అధికారులు సూచించారు.
  • అభ్యర్థులు పరీక్ష రాసేందుకు బాల్‌ పాయింట్‌ పెన్నును పరీక్ష గదిలోనే అందజేస్తారు.