Last Updated:

Tirumala: శ్రీవారి బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు.. రేపటి నుంచే అమలు

తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన వేళలను మారుస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. రాత్రి సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం వారికి ఉదయం త్వరగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ మార్పులు రేపటి నుంచే అమలవనున్నాయి.

Tirumala: శ్రీవారి బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు.. రేపటి నుంచే అమలు

Tirumala: తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన వేళలను మారుస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. రాత్రి సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం వారికి ఉదయం త్వరగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ మార్పులు రేపటి నుంచే గురువారం అనగా డిసెంబర్ 1 నుంచే అమలులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.

వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లున్న భక్తులు ఇప్పటి వరకు ఉదయం 6 గంటలకే స్వామి వారిని దర్శించుకోగా దానిని తాజాగా ఉదయం 8 గంటలకు మార్చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. నెల రోజుల పాటు ఈ విధానాన్ని పరిశీలించి, ఫలితాలను బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఉదయం 10.30 నుంచి జనరల్‌ బ్రేక్‌ దర్శనం ప్రారంభిస్తారు. ఇక ఈ తాజా నిర్ణయంతో సామాన్య భక్తులు వేచి ఉండే సమయం తగ్గనుంది. భక్తులు ఏరోజుకారోజు తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉందని, ఫలితంగా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

ఇవి కూడా చదవండి: