Published On:

Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Nellore: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఐదుగురు మెడికోలు సహా.. మొత్తం ఆరుగురు మృతిచెందారు.

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న రమణయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఇక కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఐదుగురు ప్రాణాలు విడిచారు. వీరు ఐదుగురిని నారాయణ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ నరేష్, అభిసాయి, నారాయణ, యజ్ఞేష్, అభిషేక్ గా గుర్తించారు. ప్రమాదం నుంచి ఓ విద్యార్థి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.