Published On:

Hayathnagar: ప్రేమ పేరుతో వేధింపులు, బాలిక ఆత్మహత్య, పట్టించుకోని పోలీసులు

Hayathnagar: ప్రేమ పేరుతో వేధింపులు, బాలిక ఆత్మహత్య, పట్టించుకోని పోలీసులు

Hyderabad: 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ప్రేమపేరుతో యువడు వేధించగా ఈ ఘటన సంభవించింది. పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు బాలిక శవంపై పడి రోదిస్తున్నారు.

హయత్ నగర్‌లోని రంగనాయకుల గుట్టలో ఓ బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మీనాక్షి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా రోహిత్ అనే యువకుడు ప్రేమ పేరుతో మీనాక్షిని వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తనను ప్రేమించాలని ఇంస్టాగ్రామ్‌లో బాలికకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినట్లు చెబుతున్నారు.

 

రెండు రోజుల క్రితం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం, రోహిత్ వేధింపుల కారణంగానే బాలిక ఆత్యహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

 

ఇవి కూడా చదవండి: