Home / బ్రేకింగ్ న్యూస్
ఈ ఏడాది భారత్ సహా పలు దేశాలను భయపెడుతోన్న మంకీపాక్స్కు కొత్త పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మంకీపాక్స్ అనే పేరు జాత్యహంకారానికి కారణం అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో దాని పేరును ‘ఎంపాక్స్’గా మార్చింది.
వివాహం అన్నాక విందు కామన్. కొంతమంది అయితే పెళ్లిళ్లలో విందులో వడ్డించే ఐటమ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. అయితే వివాహ విషయంలో ఒక్కోదగ్గర ఒక్కో సంప్రదాయం ఉంటుంది. కాగా తాజాగా ఓ పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదన్న కారణంతో మగ పెళ్లివారు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సేవలు మంగళవారం నిలిచిపోయాయి. జియో యూజర్లు కాలింగ్, మెసేజింగ్ వంటి పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. దానితో ప్రస్తుతం ట్విట్టర్లో #Jiodown హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.
జియో ఫేస్బుక్- ఇన్స్టాగ్రామ్ రీల్స్కు పోటీగా సరికొత్త యాప్ తో వినియోదారులను ఆకర్షించేందుకు సన్నద్దమవుతుంది. "ప్లాట్ఫామ్" పేరుతో కొత్త యాప్ను తీసుకొచ్చేందుకు జియో ప్రణాళికలు చేస్తుంది.
ఒకే ఓవర్లో ఏడు సిక్స్లు కొట్టి నయా రికార్డు నెలకొల్పాడు రుతురాజ్ గైక్వాడ్. విజయ్ హజారే ట్రోఫీలో రెండో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్పై గైక్వాడ్ ఈ అరుదైన ఘనత సాధించాడు.
తెలంగాణలోని మరో రెండు చారిత్రక కట్టడాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కుతుబ్షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోటకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు లభించాయి.
మెట్రో ప్రయాణికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రెండో ఫేజ్ పనులకు సంబంధించి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు.
ఇప్పటంలో ఇళ్ల కూల్చి తన గుండెళ్లో గునపం దింపారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తాం అని సవాల్ విసిరారు. కూల్చివేతలో అధికారులు పద్ధతి పాటించలేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం తనను బాధించిందని ఆయన తెలిపారు.
అయ్యప్ప మాలలో ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముస్లిం టోపీ ధరించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని బీజేపీ, బీజేవైఎం నేతలు మండిపడ్డారు. ఆయన ఇంటిని కూడా ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాగా తాను ముస్లిం టోపీ ధరించడంపై మాజీ మంత్రి వివరణ ఇచ్చారు.
ఎల్గార్ పరిషత్-మావోయిస్ట్ సంబంధాల కేసులో నిందితుడు ఆనంద్ తెల్తుంబ్డే శనివారం నవీ ముంబైలోని తలోజా సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు.