Home / బ్రేకింగ్ న్యూస్
పవన్ అభిమానులుకు గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు వరుసగా సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. రన్ రాజా రన్, సాహోలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన మేకర్స్ పోస్టర్ను రిలీజ్ చేశారు
హైదరాబాదులోని శిల్పకళావేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం తాను ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ కిందే లెక్క అని వెల్లడించారు.
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ శుక్రవారం కామెంటరీ చెబుతూ అస్వస్దతకు గురయ్యారు. ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఏపీలో ఉండనున్నారు ఆమె. గతంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం ఏపీ వచ్చిన ఆమె.. ఈసారి రాష్ట్రపతి హోదాలో రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు.
దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ స్కాంలో మరో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో వైకాపా నేత, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును ఈడీ అధికారులు చేర్చిన సంగతి విదితమే. అయితే దీనిపై స్పందించిన మాగుంట ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనకు ఎలాంటి పాత్ర లేదని గురువారం స్పష్టం చేశారు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజురోజుకు అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు సీరియస్ గా తీసుకున్న ఈడీ విచారణను వేగవంతం చేస్తోంది. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఈ కేసు విషయంలో కవిత మీడియా ముందుకు వచ్చారు.
గుజరాత్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవగా సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మొత్తంగా 788 మంది అభ్యర్థులు బరిలో నిలచున్నారు.
లైగర్ సినిమా నిర్మాణంలో మనీ లాండరింగ్ జరిగిందన్న నేపథ్యంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ సినిమా పెట్టుబడుల విషయమై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో ఈ చిత్ర దర్శక నిర్మాతలైన పూరీ జగన్నాథ్, చార్మీలను అధికారులు విచారించారు. కాగా తాజాగా నేడు ఈ సినిమా హీరో అయిన విజయ్ దేవరకొండను కూడా విచరణకు పిలిపించారు.
నిన్నమొన్నటి వరకు మంచి ధర పలికిన టమాట ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయింది. రెండంకెల్లో ఉన్న ధర ఇప్పుడు రెండు రూపాయలకు పడిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
ప్రగతిభవన్ వద్ద హైడ్రామా నెలకొంది. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న షర్మిల కాన్వాయ్ పై తెరాస కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ ధ్వంసమైన కారులో భారీ కాన్వాయ్తో నేడు ప్రగతిభవన్ ముట్టడికి షర్మిల యత్నించారు. దానితో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సోమాజిగూడ వద్ద షర్మిలను అడ్డుకుని అరెస్ట్ చేశారు.