Home /Author M Rama Swamy
Property Tax Discount : ఆస్తి పన్ను బకాయిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు ఏపీ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2025 మార్చి 31లోగా చెల్లించే బకాయిలకు మాత్రమే 50 శాతం వడ్డీ మాఫీ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ ఇవాళ ఉత్తర్వులు జారీ […]
Tihar Jail : ఆసియాలోనే అతిపెద్దదైన తిహార్ జైలును మరో ప్రాంతానికి మార్చేందుకు ఢిల్లీ సర్కారు సిద్ధమైంది. సీఎం రేఖా గుప్తా మంగళవారం ఓ ప్రకటన చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసేలా సర్వే, కన్సల్టెన్సీ సర్వీసుల ఏర్పాటుకు రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. జైలు విస్తీర్ణం, ఖైదీల కారణంగా దాని చుట్టుపక్కల నివసించేవారి భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ఈ జైలును 1958 సంవత్సరంలో నిర్మించారు. […]
Kakani Govardhan Reddy : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన మరో నేత చిక్కుల్లో పడ్డారు. క్వార్జ్ ఖనిజం తరలించారనే ఫిర్యాదుతో నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్లో లీజు ముగిసినా క్వార్జ్ తరలించారని ఆరోపణలు వచ్చాయి. మైన్స్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రూ.250 కోట్ల విలువైన క్వార్జ్ తరలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకాణి సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు […]
Gorantla Butchaiah Chowdary : నియోజకవర్గాల పునర్విభజనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాన్ అంతర్గతంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఎన్డీఏలో తాము భాగస్వామ్యంగా ఉన్నందున బహిరంగంగా మాట్లాడకూడదని చెప్పారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా క్రమశిక్షణ పాటించాయన్నారు. ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని చెప్పారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అపర గోబెల్స్లా మాట్లాడారని, […]
Komatireddy Rajagopal Reddy : తనకు ఆ శాఖ అంటే ఇష్టమని, కానీ అధిష్ఠానం ఏ పదవి ఇచ్చినా చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టాడు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఇవాళ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని, భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించానని పేర్కొన్నారు. […]
SLBC Tunnel : ఎస్ఎల్బీసీ సొరంగంలో నెల రోజుల క్రితం ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ పురోగతి సాధించింది. ఇవాళ రెస్క్యూ ఆపరేషన్కు వెళ్లిన సిబ్బందికి మరో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. మృతదేహాన్ని వెలికి తీసి మధ్యాహ్నం బయటకు తీసుకొచ్చారు. మృతుడి యూపీకి చెందిన మనోజ్ కుమార్గా గుర్తించారు. టన్నెల్లో ఏఈగా విధులు నిర్వర్తిస్తూ ప్రమాదంలో చిక్కుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్న రెస్క్యూ టీంకు టీబీఎం శిథిలాల కింద దుర్వాసన వచ్చింది. దీంతో తవ్వకాలు […]
Supreme Court : తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించలేదన్నారు. నోటీసు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎలక్షన్లో పోటీ చేసి […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. లఖ్నవూ బ్యాటర్లు నికోలస్ పూరన్ 30 బంతుల్లో 75 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72 అర్ధశతకంతో రాణించాడు. చివర్లలో డేవిడ్ మిల్లర్ 27 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లలో లఖ్నవూ 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, కుల్దీప్ […]
Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ కానున్నారు. ఢిల్లీలోని ఇందిరాభవన్లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, కేబినెట్ విస్తరణపై చర్చ జరగనున్నట్టు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని […]
Amaravati : ఏపీలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఇవాళ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ (జీఎన్యూ)తో కూటమి ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలో జీఎన్యూ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం అమరావతిలో అంతర్జాతీయ యూనివర్సిటీ స్థాపించడానికి జీఎన్యూ రూ.1,300 కోట్లు పెట్టుబడి […]