Last Updated:

IPL 2025 : ఆర్సీబీ విజయ లక్ష్యం 175

IPL 2025 : ఆర్సీబీ విజయ లక్ష్యం 175

IPL 2025 : ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్స్ గార్డెన్స్ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు విజృంభించారు. ఒకరిద్దరూ మినహా అందరూ రాణించారు. సునీల్ నరైన్ 26 బంతుల్లో 44 పరుగులు చేశాడు. మూడు సిక్సులు, 4 ఫోర్టు కొట్టాడు. కెప్టెన్ అజింక్య రహానే 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. 4 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. తర్వాత రఘువంశీ చివరి వరకూ పోరాడి 30 పరుగులు చేశాడు. మొత్తంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయం సాధించాలంటే 175 పరుగులు చేయాల్సి ఉంది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. హేజల్ వుడ్ 2, రసిక్ దర్ సలామ్, సుయాశ్ శర్మ చెరో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి: