Home /Author M Rama Swamy
Bomb threat to Punjab and Haryana High Court: పంజాబ్, హర్యానా హైకోర్టులకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం కోర్టులో బాంబు ఉందంటూ ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కోర్టు రూమ్లను ఖాళీ చేయించారు. చడీగఢ్ పోలీసులతోపాటు రెస్క్యూ టీమ్, ఫైర్ సిబ్బంది హైకోర్టులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వస్తువును పరిశీలిస్తున్నారు. కోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత.. లాయర్లు కోర్టు ఆవరణను విడిచి వెళ్లాలని బార్ […]
Union Minister of External Affairs Jaishankar Comments on US over India Pakistan Conflict: భారత్-పాక్ మధ్య సంధికి మధ్యవర్తిత్వం విషయంలో అగ్రరాజ్యం అమెరికా పాత్రపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. కాల్పుల విరమణపై ఇరుదేశాలు నేరుగా చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీన జరిగిన అవగాహన ఒప్పందం న్యూఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమని స్పష్టం చేశారు. ఇరుదేశాల ప్రతినిధులు హాట్లైన్ ద్వారా చర్చించినట్లు చెప్పారు. […]
Elon Musk sensational decision : ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ నేతలకు కలవరం కలిగించింది. రానున్న రోజుల్లో రాజకీయ కార్యక్రమాలకు సొమ్ములు ఖర్చు పెట్టడం నిలిపివేస్తానని ఎలన్ మస్క్ బాంబు పేల్చారు. వాస్తవానికి రిపబ్లికన్ పార్టీ కార్యక్రమాలకు డాలర్లు ఖర్చు పెట్టేది మస్కే. ఈ నేపథ్యంలో ఇక పై సొమ్ములు ఖర్చు పెట్టేది లేదని మస్క్ అనడంతో రిపబ్లికన్ పార్టీ నేతలకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. […]
Donald Trump : ఒకవైపు ఇరాన్తో అణ్వాయుధాల అంశంలో ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, మరోవైపు ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడులు చేయడానికి ఇజ్రాయెల్ పక్కాగా ప్రణాళికలు తయారు చేస్తోంది. ఇజ్రాయెల్ పన్నాగాలను అమెరికా అధికారులు పసిగట్టారు. అణ్వాయుధాల తయారీకి ఇరాన్, అగ్రరాజ్యం దేశాల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించి ఇరాన్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ విషయంలో్ […]
Prime Minister Narendra Modi : ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎన్కౌంటర్పై ప్రధాని మోదీ తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నానని కొనియాడారు. మావోయిజం ముప్పును నిర్మూలించి.. ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన పోస్టును మోదీ రీపోస్టు […]
Maoist leader Nambala Kesava Rao : ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు దుర్మరణం చెందారు. విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా ఎక్స్లో వెల్లడించారు. బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోలు మృతిచెందారు. మృతిచెందన వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. కేశవరావుపై రూ.1.5కోట్లు రివార్డు ఉందని తెలిపారు. గణపతి తర్వాత పార్టీ పగ్గాలు.. ఎన్కౌంటర్లో మృతిచెందిన నంబాల కేశవరావు […]
Drones in Kolkata : కోల్కతాలో ఇటీవల కాలంలో రాత్రి వేళల్లో ఆకాశంలో డ్రోన్లను పోలిన వస్తువులు కనిపిస్తుండటం కలకలం రేపింది. భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటనపై నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. గూఢచర్యంతోపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కోల్కతా నగరంలోని హేస్టింగ్స్ ప్రాంతం, విద్యాసాగర్ సేతు తదితర ప్రాంతాల్లో దాదాపు 10 డ్రోన్ల లాంటి వస్తువులు ఆకాశంలో ఎగురుతూ కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై నివేదిక […]
Suicide attack on school bus : పాక్లోని నైరుతి ప్రాంతంలో బుధవారం ఓ పాఠశాల బస్సుపై ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులతోపాటు ఐదుగురు మృతిచెందగా, 38 మంది గాయపడ్డారు. వివరాలను అసోసియేటెడ్ మీడియా వెల్లడించింది. బలోచిస్థాన్ ప్రావిన్స్లోని ఖుజ్దార్ జిల్లాలో ఓ బస్సు చిన్నారులను పాఠశాలకు తీసుకెళ్తుండగా, దాడి జరిగిందని డిప్యూటీ కమిషనర్ యాసిర్ ఇక్బాల్ తెలిపారు. దీంతో పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య […]
National Education Policy : జాతీయ విద్యావిధానం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు సర్కారు మధ్య కొంతకాలంగా యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని ఎంకే.స్టాలిన్ సర్కారు ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తోంది. సూత్రం ప్రకారం, విద్యార్థులు ఇంగ్లిష్ ప్రాంతీయ భాషతోపాటు మూడో భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. హిందీ భాషను బలవంతంగా రుద్దుతోంది.. జాతీయ విద్యావిధానం ముసుగులో కేంద్ర ప్రభుత్వం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని తమిళ సర్కారు మండిపడుతోంది. ఈ […]
Karnataka government gives six tame elephants to AP : ఆంధ్రప్రదేశ్కు ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక సర్కారు అప్పగించింది. బుధవారం బెంగళూరులోని విధాన సౌధలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో కార్యక్రమం జరిగింది. కుంకీ ఏనుగుల అప్పగింత, సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్కు సీఎం సిద్ధరామయ్య అందజేశారు. సీఎం సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు : పవన్ కల్యాణ్ ఆరు కుంకీ ఏనుగులు […]