Home /Author anantharao b
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం చౌరస్తా వద్ద హైదరాబాద్కు వెళ్తున్న లారీని మరో లారీని ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా 100 కు పైగా మేకలు కూడా చనిపోయాయి.నాగ్పూర్కు చెందిన డ్రైవర్ శుక్లాల్ మినహా మరణించిన మరియు గాయపడిన వారందరూ మధ్యప్రదేశ్ కు చెందిన వారని తెలుస్తోంది
తమిళనాడు రాష్ట్రానికి నీట్ పరీక్షనుంచి మినహాయింపు ఇవ్వాలని , 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులను మెడికల్ కోర్సుల్లో చేర్చుకునేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులోని పరిశ్రమలో పేలుడు సంభవించింది. సౌత్ గ్లాస్ పరిశ్రమలో కంప్రెషన్ పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది
పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెడగొట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.విభజన కంటే జగన్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.
న్యూఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీకవితను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం కలిశారు.ఈ సందర్బంగా ఆమె యోగక్షేమాలను విచారించారు. ఈ సందర్బంగా తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్థితిపై కవిత ఆరా తీసినట్లు సమాచారం.
బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య.. కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాలె యాదయ్యకు కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. కాలె యాదయ్య చేరికతో.. ఇప్పటి వరకు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్లైంది.
మాల్దీవుల అధ్యక్షుడు ముయిజుపై చేతబడి చేసారన్న ఆరోపణలపై మంత్రి ఫాతిమత్ షమ్నాజ్ అలీ సలీమ్తో పాటు మరో ఇద్దరిని రాజధాని మాలేలో ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.విచారణ కోసం వారం రోజుల పాటు ఆమెను రిమాండ్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతంశుక్రవారం తెల్లవారుజామునుంచి ఉరుములు మరియు ఈదురు గాలులతో కూడిన ఎడతెరిపిలేని వర్షాలతో అతలాకుతలమైంది.ఇటీవలి వేడి నుండి ఢిల్లీవాసులకు చాలా ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించింది.
ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ తొలిసారి తెలంగాణకు వస్తున్నారని తెలంగాణ జనసేన నేత సాగర్ అన్నారు. పవన్ కొండగట్టు పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు. రేపు ఉదయం 7గంటలకు మాదాపూర్ నివాసం నుంచి కొండగట్టుకు పవన్ వెళ్తారని ఆయన అన్నారు.
శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన తరువాత, టెర్మినల్ 1 నుండి అనేక విమానాలు రద్దు చేయబడ్డాయి మరియు అనేక ఇతర సర్వీసులు ఇతర టెర్మినల్లకు మార్చబడ్డాయి.