Baloch Rebels: పాకిస్థాన్కు ‘ఆపరేషన్ సిందూర్’ ఎపెక్ట్.. బలూచిస్తాన్కు విముక్తి.. జెండాలను పీకి పందిరివేశారు

Operation Sindoor Effect on Pakistan, Baloch Rebels Hoist Flags of Liberation: ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్ ఫ్యూజులు ఎగిరిపోయిన సమయంలో బలూచిస్తాన్ వేర్పాటు వాదులు విజృంభించారు. పాకిస్తాన్ భద్రతా బలగాలపై భీకర దాడులు చేశారు. బలూచ్ ప్రాంతంలో పాకిస్తాన్ జెండాలు పీకి పందిరివేశారు. ఇదే అదను చూసి పాకిస్తాన్ కు దెబ్బకొట్టారు. అంతిమంగా పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి బలూచిస్తాన్కు విముక్తి లభించింది. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ ఎపిసోడ్ ప్రభావం పాకిస్తాన్ పై దారుణంగా ఉంది.
పాకిస్తాన్ తన గోతిని తానే తవ్వుకుంది. ఆర్థికంగా దివాలా అంచున ఉన్న పాకిస్తాన్ ను ఆ దేశ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రజలు తిండి లేక నకనకలాడుతున్నారు. నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. దేశంలో రాజకీయ స్థిరత్వం లేదు. పైపెచ్చు సైన్యం నుంచి ఆదేశాలు. ఈ నేపథ్యంలో అందినకాడికి అప్పులు చేసింది పాకిస్తాన్. చేసిన అప్పులు తీర్చలేదు సరికదా…వడ్డీలు కూడా కట్టలేకపోయింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల దగ్గర అప్పుల అప్పారావుగా అన్ పాపులర్ అయింది. దేశం ఇంత దారుణ స్థితిలో ఉంటే, పాలకులు ఎవరైనా ఏం చేస్తారు ? పరిస్థితి చక్కదిద్దడానికి ప్రయత్నిస్తారు.
అయితే పాకిస్తాన్ పాలకుల తీరే వేరు. దేశ ప్రజలు ఆకలితో అల్లాడుతున్నావారికి చీమ కుట్టినట్లు ఉండదు. చీటికిమాటికి పొరుగుదేశాలతో కయ్యానికి కాలు దువ్వడం, ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించడం ..వీటికే ఇస్లామాబాద్ పాలకులు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులను ప్రోత్సహించి ఏప్రిల్ 22న భారత్ లోని పహెల్ గాంలో నరమేధానికి శ్రీకారం చుట్టింది. ఈ నరమేధంలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.దీంతో భారత్ , ఆగ్రహంతో రగిలిపోయింది. పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది.ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది.
భారత్ భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. పాకిస్తాన్ పాలకులకు కళ్లు బైర్లు కమ్మాయి.ఇదే అదనుగా భావించి బలూచిస్తాన్ వేర్పాటు వాదులు ఉద్యమించారు. వాస్తవానికి బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశం. 1947 లో పాకిస్తాన్ ఏర్పడే నాటికి పాకిస్తాన్ లో అంతర్భాగం ఏమాత్రం కాదు. అయితే జిన్నా కుట్ర ఫలితంగా నాలుగు ప్రాంతాలుగా ఉన్న బలూచిస్తాన్ ను బలవంతంగా కలిపేశారు. దీంతో 1947 నుంచి పాకిస్తాన్ లో బలూచిస్తాన్ అంతర్బగం అయింది. ఒక రాష్ట్రంగా కొనసాగుతోంది.
అయితే బలూచిస్తాన్ లో సహజ వనరులు ఎక్కువ. ఖనిజ సంపదకు బలూచిస్తాన్ పెట్టింది పేరు. అంతేకాదు పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు కూడా ఉన్నాయి. దీంతో దేశ ఆర్థిక అవసరాలకు బలూచిస్తాన్ సహజ వనరులను ఉపయోగించుకోవడం మొదలెట్టారు పాకిస్తాన్ పాలకులు. ఇందుకు బలూచిస్తాన్ స్థానిక నాయకులు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు.అయితే పాకిస్తాన్ పాలకులది డబుల్ స్టాండర్డ్ వ్యవహారం. ఒకవైపు ఆర్థిక అవసరాలకు బలూచిస్తాన్ పై ఆధారపడింది.మరోపైపు బలూచిస్తాన్ లో అభివృద్దిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇస్తామాబాద్ ఈ రెండు నాల్కల ధోరణి బలూచిస్తాన్ స్థానిక నాయకులలో తీవ్ర అసంతృప్తి రగిలించింది.
అభివృద్ది లేమితో రగిలిపోయిన బలూచ్ నాయకులు తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ఇస్లామాబాద్ ను అనేక సార్లు కోరారు. అలాగే బలూచిస్తాన్ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఈ డిమాండ్ ను కూడా ఇస్లామాబాద్ పాలకులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ లో మెల్లమెల్లగా వేర్పాటు వాద ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రత్యేక బలూచిస్తాన్ దేశం ఏర్పాటు చేయడానికి వీలుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది. వాస్తవానికి బీఎల్ ఏ ఒక మిలిటెంట్ సంస్థ కిందే లెక్క. బలూచిస్తాన్ కు స్వాతంత్రం తెచ్చి పెట్టింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లే.
బలూచిస్తాన్ ఎపిసోడ్ ప్రభావం, పాకిస్తాన్ పై ఆర్థికంగా బాగా ఉండే అవకాశాలున్నాయి. ఇన్నాళ్లూ కేవలం బలూచిస్తాన్ ఖనిజ సంపద మీదనే పాకిస్తాన్ ఆధారపడింది. ఇప్పుడు బలూచిస్తాన్ ప్రత్యేక దేశం అయింది కాబట్టి, అక్కడి ఖనిజాలు,బొగ్గు ఇతర సహజ సంపదపై ఎటువంటి అధికారం ఉండదు. దీంతో పాకిస్తాన్ మరింతగా దివాలా అంచుకు చేరడం ఖాయం.
పాకిస్తాన్ ది మొదట్నుంచి ఒకటే పాలసీ. పంజాబ్ ప్రొవిన్స్ కు టాప్ ప్రయారిటీ ఇవ్వడం. పాకిస్తాన్లోని బడా నాయకులందరూ పంజాబ్ ప్రొవిన్స్ నుంచి వచ్చినవారే. అంతేకాదు ఆర్మీ చీఫ్ లు కూడా ఎక్కువ మంది పంజాబ్ ప్రొవిన్స్ కు చెందినవారే. అయితే పంజాట్ కు టాప్ ప్రయారిటీ ఇవ్వడాన్ని మిగతా రాష్ట్రాలు కూడా గమనించాయి. దీంతో ఆయా రాష్ట్రాల వారు కూడా ఇస్లామాబాద్ పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. ప్రధానంగా పాకిస్తాన్ పాలకులపై సింధ్ ప్రాంత ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బలూచిస్తాన్ పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని ఏ క్షణమైనా సింధ్ ప్రాంతం కూడా తిరుగుబాటు బావుటా ఎగరవేయవచ్చు.
ఇదిలా ఉంటే, తాజాగా తెహ్రీక్ – ఏ -తాలిబాన్ పాకిస్తాన్ రెబెల్స్ కూడా తిరుగుబాటు చేశారు. వీరు కూడా వేర్పాటు వాదులే. తాజాగా పాకిస్తాన్ భద్రతా బలగాలు అలాగే తెహ్రీక్ – ఏ -తాలిబాన్ పాకిస్తాన్ రెబెల్స్ మధ్య దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇరవైమంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్లు సమాచారం. మొత్తానికి పాకిస్తాన్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.