Home / tamil nadu
కోలీవుడ్ లో విజయవంతమైన నటుడిగా నిరూపించుకున్న విజయకాంత్ సెప్టెంబర్ 2005లో డీఎండీకేని స్థాపించడం ద్వారా తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంటరయ్యారు. తమిళనాట అప్పటికే సంస్దాగతంగా బలంగా ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) మరియు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) లకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నించారు.
తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాల నేపధ్యంలో నాలుగు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల నుండి 12,553 మందిని 143 షెల్టర్ హౌస్లకు తరలించారు. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు. తూత్తుకుడి పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి.
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని బాణాసంచా కర్మాగారాల్లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు పేలుళ్లలో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. వీరందరూ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులుగా పోలీసులు భావిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు అధికారులు పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందిని రంగంలోకి దించారు.
స్థానిక ఇసుక మాఫియాకు సంబంధించిన కేసులకు సంబంధించి తమిళనాడులోని 40కి పైగా ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద ఈ సోదాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఆగి ఉన్న వ్యాను ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఏడుగురు మహిళలు చనిపోయారు. 15 మంది మహిళలతో సహా 19 మందితో కూడిన మినీ బస్సు ధర్మశాల నుంచి తిరిగి వస్తోంది.
తమిళనాడులోని కృష్ణగిరిలో 27 ఏళ్ల మహిళ ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించింది. ఆమె భర్త ఇంట్లో సహజ ప్రసవానికి ప్రయత్నించాడు, అతను యూట్యూబ్లో నేర్చుకున్న టెక్నిక్ని ఉపయోగించి ప్రసవం చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు.
తమిళనాడులోని కృష్ణగిరిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ పేలుడు కారణంగా సమీపంలోని ఓ హోటల్ భవనం కూలిపోగా, మరో నాలుగు భవనాలు పాక్షికంగా దెబ్బతినడంతో పలువురు చిక్కుకుపోయారు.పాతాయపేట లో ఉన్న ఈ బాణాసంచా తయారీ గోడౌన్లో తీవ్రంగా గాయపడిన 12 మందిని ఇప్పటివరకు ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ దేశానికి అంకితం చేయనున్నారు
తమిళనాడులో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో కల్తీ మద్యం సేవించి 13 మంది మృతి చెందగా, పలువురు ఆస్పత్రి పాలయ్యారు. విల్లుపురం జిల్లా మరక్కానంలో తొమ్మిది మంది, చెంగల్పట్టు జిల్లా మదురాంతకం వద్ద కల్తీ మద్యం సేవించి నలుగురు మృతి చెందారు.
తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత సీఎం స్టాలిన్ మొదటిసారిగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఈ సందర్బంగాస్టాలిన్ ప్రభుత్వంలో గత రెండేళ్లుగా ఆర్దికమంత్రిగా ఉన్న త్యాగరాజన్ ను ఐటీ మంత్రిత్వశాఖ కు మార్చారు. పీటీఆర్ అని కూడా పిలువబడే పళనివేల్ త్యాగ రాజన్ గత రెండేళ్లుగా ఆర్థిక మంత్రిగా పనిచేశారు.