Home / tamil nadu
ఏఐఏడీఎంకే నుంచి ఓ పన్నీర్సెల్వం ను బహిష్కరిస్తూ జనరల్ కౌన్సిల్ సమావేశం తీసుకున్న నిర్ణయం చెల్లదని పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ అన్నారు. ఇది కేవలం స్వార్దప్రయోజనాలకోసం సమావేశమయిందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని శశికళ అన్నారు.
తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేలో రెండు గ్రూపుల మధ్య పోరు తారస్దాయికి చేరుకుంది. ప్రస్తుతం ఉన్న ద్వంద్వ-నాయకత్వ నమూనాకు స్వస్తి పలికి అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి ఎన్నికయ్యారు నేడు జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ పళనిస్వామిని ఎన్నుకుంది.
అన్నాడీఎంకే లో మరోసారి రచ్చ మొదలైంది. పార్టీ కార్యాలయాల వద్దే ఇరు వర్గాల కార్యకర్తుల బాహాబాహీకి దిగారు. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అన్నాడీఎంకే పై పట్టు కోసం అటు పన్నీర్ సెల్వం, ఇటు ఎడప్పాడి పళనిస్వామి రెండు వర్గాలుగా చీలిపోయారు. పార్టీ ఒకరి చేతిలోనే ఉండాలని పళని స్వామి ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. చెన్నైలోని నుంగంబాకం ఇంట్లో ఆరుగురు సీబిఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో ఓ సారి కార్తీ చిదంబరం ఇంటిపై దాడి చేసినప్పుడు ఆ గదికి తాళాలు వేసి ఉన్నాయి. దాని తాళం చెవులు మాత్రం కార్తీ వద్దనే ఉన్నాయి. అప్పుడు ఆయన లండన్ ఉన్నారు.