Home / Road Accident
Nandyal: ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో బొలేరో వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. కాగా బాధితులు శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్లి వస్తున్నట్టు బంధువులు తెలిపారు. ఘటనలో 21 మందికి గాయాలు కాగా స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలైన ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితులంతా ఆదోనికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని […]
Nellore: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఐదుగురు మెడికోలు సహా.. మొత్తం ఆరుగురు మృతిచెందారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న రమణయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఇక కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఐదుగురు ప్రాణాలు […]
Six Killed Road accident in ferozpur: పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నుహ్ జిల్లాలోని ఫిరోజ్పూర్ ఝిర్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇబ్రహీంబాస్ గ్రామ సమీపంలో ఢిల్లీ-ముంబై జాతీయ రహదారిపై పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఓ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పారిశుద్ధ్య కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం […]
Medak Road Accident : రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంకట్రావుపేట స్టేజీ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి షాపూర్నగర్కు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ నుంచి మెదక్ వైపు ఆల్టో కారు వెళ్తున్నారు. ఇదే సమయంలో ఎదురుగా వచ్చిన మరో కారు ఆల్టో కారును ఢీకొట్టింది. దీంతో ఆల్టోకారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం […]
Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం అదుపుతప్పి వంతెనను ఢీ కొట్టింది. దీంతో ఆంధ్రప్రదేశ్కి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్లే.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురం గ్రామస్తులు గొర్రెలను కొనుగోలు చేసేందుకు బొలెరో వాహనంలో కర్ణాటకకు వెళ్లగా, యాద్గిర్ జిల్లాలో ప్రమాదం జరిగింది. యాద్గిర్ జిల్లాలోని షాపూర్ వైపు వెళ్తుండగా, మార్గమధ్యలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో దేవదుర్గ తాలూకాలోని అమరాపుర క్రాస్ […]
6 People died in Ap and Telangana Road Accident’s: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. ఏపీ, తెలంగాణలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొని ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి నుంచి అతివేగంగా వచ్చిన స్కార్పియో ఆర్టీసీ బస్సు, పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో […]
Road Accident in srishatyasai dist three people died: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలంలో ధనపురం క్రాస్ వద్ద జాతీయరహదారి వద్ద గుర్తు తెలియని వాహనం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. అలాగే వాహనంలో ఉన్న ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను […]
Road accident : ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని దంపతులు, 8 ఏళ్ల కుమార్తె ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను గడ్డం రవీందర్, రేణుక, […]
Road Accident in Hyderabad: హైదరాాబాద్లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అడిషనల్ డీసీపీ దుర్మరణం చెందాడు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లక్ష్మారెడ్డి పాలెం మైత్రి కుటీర్లో నివాసం ఉంటున్న అడిషనల్ డీసీపీ బాబ్జి తెల్లవారుజామున వాకింగ్ వెళ్లారు. ఈ సమయంలో ఆయన రోడ్డు దాటుతుండగా.. విజయవాడ జాతీయ రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ […]
Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సారవకోట మండలం కురిడింగి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరుగగా, ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు కారు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పాతపట్నానికి చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్ (56), భార్య వాణి(45) మృతిచెందారు. కుమారుడితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో […]