Home / Rahul Gandhi
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం కొత్త సాధారణ పాస్పోర్ట్ను అందుకున్నారు,గాంధీకి ఆదివారం పాస్పోర్టు మంజూరు చేస్తామని పాస్పోర్ట్ కార్యాలయం హామీ ఇచ్చిందని, మధ్యాహ్నం దానిని పొందారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాహుల్ అమెరికాలో మూడు నగరాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.
కర్ణాటక కాంగ్రెస్ నేత టీబీ జయచంద్ర మనవరాలు తన తాతను మంత్రిని చేయాలని రాహుల్ గాంధీకి లేఖ రాసింది. ఇటీవల జరిగిన కర్నాటక మంత్రివర్గ విస్తరణలో తన తాతయ్యకు చోటు దక్కకపోవడంతో జయచంద్ర మనవరాలు ఆర్ణా సందీప్ రాహుల్ గాంధీకు లేఖ రాసింది.
ప్రతిపక్ష పార్టీల బహిష్కరణ పిలుపు మధ్య ఆదివారం కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పట్టాభిషేకంగా పరిగణించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటును ఆయన ప్రజలగొంతుగా అభివర్ణించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనకు జారీ చేసిన డిప్లమాటిక్ పాస్పోర్ట్ను సరెండర్ చేశారు.క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా తేలడంతో మార్చిలో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం పై అనర్హత వేటు పడింది
: కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ పాస్పోర్ట్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు శుక్రవారం పాక్షికంగా అనుమతించి మూడేళ్లపాటు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) మంజూరు చేసింది. నేను మీ దరఖాస్తును పాక్షికంగా అనుమతిస్తున్నాను.
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరయ్యారు. మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో కొత్త పాస్ పోర్టకు దరఖాస్తు కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు, అతను వయనాడ్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగితే, అమేథీ పట్టిన గతే ఈ నియోజకవర్గానికి పడుతుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం రాత్రి ట్రక్కు డ్రైవర్లను సందర్శించి వారి సమస్యలను తెలుసుకునేందుకు, వారి మన్ కీ బాత్ వినేందుకు వెళ్లారు. పార్టీ ట్వీట్ చేసిన విజువల్స్లో, గాంధీ ట్రక్కులో కూర్చొని, డ్రైవర్లలో ఒకరితో ప్రయాణిస్తూ మరియు ట్రక్ డ్రైవర్లతో మాట్లాడుతూ కనిపించారు.
కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రధాని కాదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం అన్నారు. త్రిభుజాకారంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరగనుంది.
మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 32 వ వర్థంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఢిల్లీలోని వీర్ భూమి వద్ద నివాళులు అర్పించారు.