Home / Rahul Gandhi
మణిపూర్లో నెలకొన్న పరిస్థితులపై, యూరోపియన్ పార్లమెంట్లో చర్చిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం మండిపడ్డారు. మణిపూర్ పరిస్దితిపై స్పందించని ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో బాస్టిల్ డే పరేడ్ కు వెళ్లారంటూ విమర్శించారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకిఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ హైకోర్టు శుక్రవారం తన 2019 మోడీ ఇంటిపేరు వ్యాఖ్యపై పరువు నష్టం కేసులో అతని పిటిషన్పై శిక్షపై స్టేను తిరస్కరించి సెషన్స్ కోర్టు ఉత్తర్వును సమర్థించింది. సెషన్స్ కోర్టు ఆదేశం న్యాయమైనది, సరైనది మరియు చట్టబద్ధమైనది అని పేర్కొంది.
బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేసారు. ఆదివారం సాయంత్రం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ను బీజేపీ కి బి టీమ్ గా అభివర్ణించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన మణిపూర్ పర్యటనలో రెండవరోజు శుక్రవారం మొయిరాంగ్కు వెళ్లారు. అక్కడ బాధిత ప్రజలను కలుసుకుని వారి కష్టాలను విన్నారు. మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ , పౌర సమాజ సంస్థ, యునైటెడ్ నాగా కౌన్సిల్ ప్రతినిధులు, మణిపూర్లోని నాగా కమ్యూనిటీ అపెక్స్ బాడీ, షెడ్యూల్డ్ తెగల డిమాండ్ కమిటీ మరియు ప్రముఖ వ్యక్తులను కూడా రాహుల్ గాంధీ కలిశారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈనెల 29,30 తేదీల్లో రాహుల్ మణిపూర్లో పర్యటిస్తారని, మృతులు క్షతగాత్రుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ వరకు ట్రక్కులో ప్రయాణించారు.ట్రక్ రైడ్ సమయంలో అతను కొన్ని పాటలను ప్లే చేయమని డ్రైవర్ను అభ్యర్థించారు. ఏ పాట అని అడిగినప్పుడు, అతను సిద్ధూ మూస్ వాలా యొక్క 295 పాటను ప్లే చేయండిఅని బదులిచ్చారు.
భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఇంటరాక్షన్లో భారత్ లోని ప్రతిపక్షాల ఐక్యత, బలం గురించి విశ్వాసం వ్యక్తం చేసారు.
అమెరికాలో 10 రోజుల పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో తీవ్ర గందరగోళం రేగింది.. ఖలిస్తానీ మద్దతుదారుల బృందం అకస్మాత్తుగా ప్రేక్షకుల నుండి లేచి, అతని ప్రసంగానికి అంతరాయం కలిగించడానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఖలిస్తానీ జెండాను ఊపడం ప్రారంభించారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన చర్చా వేదికలో రాహుల్ పాల్గొన్నారు. హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
మధ్యప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 150 సీట్లు గెలుచుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ధీమా వ్యక్తం చేశారు.ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎన్నికల సన్నద్ధత సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత మధ్యప్రదేశ్లో పార్టీ విజయ పరంపరను కొనసాగిస్తుందని అన్నారు.