Home / Opposition MPs
31 మంది ప్రతిపక్ష ఎంపీల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయింది. మణిపూర్ లో కొనసాగుతున్న సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆమెకు మెమారాండం అందజేసింది. వీరిలో ఇటీవల మణిపూర్ లో పర్యటించిన ఎంపీలు కూడా ఉన్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు గురువారం ముగియడంతో పలు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు 'తిరంగా మార్చ్' చేపట్టారు. ఈ మార్చ్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వమే పార్లమెంట్ను నడపనివ్వడం లేదు.. అదానీ స్కాంపై ఎందుకు చర్చకు ఇష్టపడడం లేదని ప్రశ్నించారు.