Last Updated:

PM Modi in Rajya Sabha: సోనియాగాంధీపై ప్రధాని మోదీ రిమోట్ కంట్రోల్ విమర్శలు.. రాజ్యసభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్

బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడుతూఆటోపైలట్‌, రిమోట్‌పైలట్‌తో ప్రభుత్వాన్ని నడిపే వారు కూడా ఉన్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై విమర్శలు ఎక్కు పెట్టారు

PM Modi in Rajya Sabha: సోనియాగాంధీపై ప్రధాని మోదీ రిమోట్ కంట్రోల్ విమర్శలు.. రాజ్యసభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్

PM Modi in Rajya Sabha: బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడుతూఆటోపైలట్‌, రిమోట్‌పైలట్‌తో ప్రభుత్వాన్ని నడిపే వారు కూడా ఉన్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై విమర్శలు ఎక్కు పెట్టారు. దీనితో ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేసారు.

మరో 20 ఏళ్లు ఉంటాము..(PM Modi in Rajya Sabha)

ప్రధాని మోదీ రాజ్యసభలో తన ప్రసంగంలో ప్రతిపక్షాలకు పని చేయడంపై నమ్మకం లేదన్నారు. తమ ప్రభుత్వం పదేళ్లు పూర్తి చేసుకుందని ఇంకా 20 ఏళ్లు ఉంటుందన్నారు. దేశ ప్రజల నిర్ణయాన్ని కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్బంగా ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వండి అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేసారు. వారు నినాదాలు చేస్తుండగానే ప్రధాని మోదీ తన ప్రసంగం కొనసాగించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే జోక్యం చేసుకోవాలనుకున్నప్పటికీ రాజ్యసభ ఛైర్ పర్సన్ పట్టించుకోలేదు. దీనితో ప్రతిపక్షఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేసారు. మల్లికార్జున్ ఖర్గే ఫుల్ ఎనర్జీగా ఉండాలని చూశాను. ఆయన తన పార్టీకి ఎంతో సేవ చేసారు. ఎందుకంటే ఎన్నికల ఓటమికి ఎవరికో ఆపాదించాల్సిన సమస్య నుంచి ఆయన రక్షించారు. అతను గోడలా నిలిచారు. అటువంటి పరిస్థితి తలెత్తినప్పుడల్లా, దళితులు మరియు వెనుకబడిన నాయకులు గాంధీ కుటుంబం సురక్షితంగా ఉండటానికి భారాన్ని మోయవలసి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్షాల సెలెక్టివ్ వైఖరి చాలా ఆందోళన కలిగిస్తోంది.. బెంగాల్‌లో ఓ మహిళను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో చూశాను.. ప్రతిపక్ష నేతలు దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని మోదీ విమర్శించారు.

నీట్ పేపర్ లీక్, మణిపూర్ హింసపై..

నీట్-యూజీ పేపర్ లీక్ కేసుపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.అవినీతికి వ్యతిరేకంగా చర్య తీసుకునేందుకు దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని, ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. అయితే దేశ యువత భవిష్యత్తుతో ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.మణిపూర్‌లో 500 మందికి పైగా అరెస్టు చేశామని, 11,000 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని ఆయన చెప్పారు.మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని… మణిపూర్‌ అంశాన్ని రాజకీయం చేయడం ప్రతిపక్షాలు మానుకోవాలని.. ఏదో ఒక రోజు మణిపూర్‌ మిమ్మల్ని తిరస్కరిస్తుంది అని మోదీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: