Home / Latest Natiional News
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తన మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1ని సెప్టెంబర్ 2న ప్రారంభించనుంది. అంతరిక్ష నౌక శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి 11:50 గంటలకు బయలుదేరుతుంది.
శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తన రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా శుక్రవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకారం, ఈ సంవత్సరం రెండు దేశాలు దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు జరుపుకుంటున్నాయి. భారతదేశం-శ్రీలంక దీర్ఘకాల సంబంధాలను సమీక్షించడానికి మరియు మరింత ఊపందుకోవడానికి ఈ సమావేశం ఒక అవకాశాన్ని సూచిస్తుంది.
పాకిస్థాన్కు చెందిన సీమా హైదర్ కు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న తన ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి ఉండటానికి నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్బంగా నేపాల్లోని పోఖారా నుండి బస్సు ఎక్కినప్పుడు ఆమె తన పేరు 'ప్రీతి'గా చెప్పినట్లు బయటపడింది.
ఉత్తరప్రదేశ్లోని యూట్యూబర్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించగా రూ.24 లక్షల నగదు దొరికింది. విచారణలో ఉన్న తస్లీమ్ కొన్నేళ్లుగా యూట్యూబ్ ఛానెల్ని నడుపుతున్నాడని మరియు దాదాపు రూ.1 కోటి సంపాదించాడని అధికారులు తెలిపారు.
ఢిల్లీలో అధికారుల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్కు మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ ఆదివారం స్పష్టం చేసింది, ఇది సానుకూల పరిణామం' అని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. దీనిపై , కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ,వారు (ఆప్) రేపు సమావేశంలో చేరబోతున్నారని నేను భావిస్తున్నాను. ఆర్డినెన్స్ విషయానికొస్తే, మా స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో పెరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలపై ఆందోళనను తెలియజేస్తూ జమియత్ ఉలమా-ఇ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ అసద్ మదానీ మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి లేఖ రాశారు.
ఉత్తరప్రదేశ్ లోని లక్నో కోర్టు వెలుపల గ్యాంగ్స్టర్ సంజీవ్ జీవాను బుధవారం ఒక వ్యక్తి కాల్చి చంపాడు. ఈ సంఘటన కోర్టు హౌస్ వెలుపల జరిగింది, అక్కడ దుండగుడు కాల్పులు జరిపడంతో సంజీవ్ జీవా చనిపోగా ఒక యువతి గాయపడింది. గ్యాంగ్స్టర్గా మారిన రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ కి సన్నిహితుడయిన సంజీవ్ మహేశ్వరి జీవా, బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో నిందితుడు.
ఉత్తరప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ వృద్ధాప్యంలో నిరాశ్రయులను రక్షించడానికి మరియు వారికి వృద్ధాశ్రమాలలో ఆశ్రయం కల్పించడానికి 'ఎల్డర్ లైన్' 14567 సేవతో ముందుకు వచ్చింది.గతంలో అదనపు డైరెక్టర్ జనరల్గా ఎమర్జెన్సీ హెల్ప్లైన్ 112కి నాయకత్వం వహించిన సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత) అసిమ్ అరుణ్ ఆలోచనకు రూపమే ఈ ఎల్డర్ లైన్.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న సందర్భంగా బుధవారం రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ర్యాలీలో ప్రసంగించే ముందు ఆయన పుష్కర్ లోని బ్రహ్మ దేవాలయంలో పూజలు చేసి ఘాట్లను సందర్శించారు.
మణిపూర్కు చెందిన పదకొండు మంది క్రీడా ప్రముఖుల బృందం రాష్ట్రంలోని ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తూ హోం మంత్రి అమిత్ షాకు లేఖ పంపింది. సంతకం చేసిన వారిలో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను కూడా ఉన్నారు.