Home / crime
6 People died in Ap and Telangana Road Accident’s: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. ఏపీ, తెలంగాణలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొని ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి నుంచి అతివేగంగా వచ్చిన స్కార్పియో ఆర్టీసీ బస్సు, పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో […]
Russia : ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. సుమీ నగరంపై జరిపిన క్షిపణుల దాడిలో 21 మంది మృతి చెందగా, 80 మంది గాయపడ్డారు. స్థానిక తాత్కాలిక మేయర్ ఆర్టెమ్ కొబ్జార్ వివరాలను వెల్లడించారు. మట్టల ఆదివారం పండుగ సందర్భంగా స్థానికులు ఒకేచోటకు చేరగా, రెండు క్షిపణి దాడులు జరిగాయని తెలిపారు. పండుగ సందర్భంగా మహా విషాదం చోటుచేసుకుందని సామాజిక మాధ్యమాల వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేతకు అగ్రరాజ్యం అమెరికా […]
Murder in Uttar Pradesh : ల్యాండ్కు సంబంధించిన డబ్బు వివాదంలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. సదరు మహిళకు మద్య తాగించి తర్వాత గొంతుకోసి మృతదేహాన్ని యుమునా నదిలో పడేశారు. ఈ ఘటన యూపీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని ఎటావా జిల్లాలో అంజలి (28) జీవనం కొనసాగిస్తోంది. తన భర్త మృతిచెందడంతో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి వద్ద ఉంటోంది. కాగా, అంజలి రియల్ ఎస్టేట్ వ్యాపారి శివేంద్ర […]
IG press meet on Pastor Praveen Pagadala Case: పాస్టర్ ప్రవీణ్ పగిడాల మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. కేసుకు సంబంధించి ఇవాళ రాజమండ్రిలో వివరాలు వెల్లడించారు. ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారని తెలిపారు. పలువురు సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టినట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని, సోషల్ మీడియాలో మాట్లాడిన వారు ఎలాంటి […]
Union Minister’s Granddaughter Murder : కేంద్ర మంత్రి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జితన్ రామ్ మాంఝీ మనువరాలు సుష్మాదేవి (32) దారుణ హత్యకు గురైంది. బిహార్లోని గయ జిల్లా అత్రి బ్లాక్ పరిధిలోని టెటువా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆమె భర్తే కాల్చి చంపినట్లు అనుమానిస్తున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. వివరాల్లోకి వెళ్తే.. సుష్మ, ఆమె భర్త రమేశ్ మధ్య మనస్పర్థలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. సుష్మాదేవి తన […]
Israel-Gaza : గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బుధవారం షెజైయాలో జరిపిన దాడిలో 38 మంది మృతిచెందినట్లు పాలస్తీనా ఆరోగ్యాధికారులు వెల్లడించారు. షెజైయాలోని ఒక భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పిల్లలు సహా కనీసం 29 మంది పాలస్తీనియన్లు మృతిచెందారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. డజన్ల కొద్దీ గాయపడ్డారని, చాలామంది శిథిలాల్లో చిక్కుకున్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఒక సీనియర్ హమాస్ ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడింది. పౌరులకు హానీ తలపెట్టకుండా ప్రయత్నాలు చేశారు […]
Theft in Kia Car Industry: ఏపీలో భారీ దొంగతనం జరిగింది. ఏకంగా కార్ల కంపెనీ కియాకు దొంగలు ఎసరు పెట్టారు. ఏపీలోని కియా కార్ల కంపెనీలో ఏకంగా 900 ఇంజిన్లు దొంగలు చోరీ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఏపీలోని శ్రీసత్య సాయి జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో 900 ఇంజిన్లను అర్ధరాత్రి దొంగిలించారు. వాస్తవంగా ఈ ఘటన మార్చి నెలలో జరిగింది. కానీ, విషయాన్ని దాచినట్లు తెలుస్తోంది. తాజాగా దొంగతనం […]
Verdict out tomorrow on Dilsukhnagar Bomb Blasts Case: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013లో జరిగిన పేలుళ్ల ఘటనలనో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలయ్యాయి. కేసు విచారణ జరిపిన ఎన్ఐఏ ఫాస్ట్ట్రాక్ కోర్టు మోస్ట్వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్పాటు ఐదుగురికి మరణశిక్ష విధించింది. శిక్షను సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్ నగరంలో రద్దీ ప్రాంతం దిల్సుఖ్నగర్లో […]
Indigo Flight Emergency Landing due to Women Death: ప్రయాణిస్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు మృతిచెందింది. ఈ సంఘటన ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఫ్లైట్లో జరిగింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం సాయంత్రం ఇండిగో ఎయిలైన్స్ విమానం ప్రయాణికులతో మహారాష్ట్ర నుంచి వారణాసికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఓ ప్రయాణికురాలు (89) అస్వస్థతకు గురైంది. ఆమె పరిస్థితి గమనించిన తోటి ప్రయాణికులు సిబ్బందికి విషయం తెలియజేశారు. అప్రమత్తమైన […]
Maharashtra Heart Attack : వయసుతో ఎలాంటి సంబంధం లేకుండానే గుండెపోటుతో పలువురు చనిపోతున్న ఘటనలు ఇటీవల జరుగుతున్నాయి. తాజాగా ఓ కళాశాల ప్రోగ్రామ్లో విద్యార్థిని మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని ధారశివ్ జిల్లాలోని ఓ కళాశాల యాజమాన్యం ఇటీవల వీడ్కోలు పార్టీ నిర్వహించింది. వీడ్కోలు పార్టీలో పాల్గొన్న 20 ఏళ్ల విద్యార్థిని వేదికపై మాట్లాడుతోంది. కళాశాలలో తన అనుభవాలు, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. తన మాటలతో […]