Home / crime
Road Accident : రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తున్న వారిపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిన్న రాత్రి 11.30 గంటల సమయంలో పెండ్లి వేడుకకు హాజరయ్యారు. అనంతరం వాన్లో తిరుగు ప్రయాణం అవుతుండగా వాహనం పిండవాల్ హిలావాడి బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో […]
Doctor arrested Drug Case in Hyderabad: ప్రజలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చెప్పాల్సిన ఓ వైద్యురాలు తప్పుడు మార్గంలో వెళ్లింది. సదరు వైద్యురాలు డ్రగ్స్కు బానిస అయ్యింది. నిషేధిత కొకైన్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కింది. దీంతో వైద్యురాలిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి 53 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని షేక్పేటలో ఏపీఏహెచ్సీ కాలనీకి చెందిన డాక్డర్ చిగురుపాటి నమ్రత(34) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో […]
Accident on the Hyderabad Outer Ring Road: పెద్దఅంబర్పేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని కారు ఢీకొట్టిగా, మంటలు చెలరేగి రెండు వాహనాలు కాలిపోయాయి. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న వాహనాన్ని టాటా క్వారీ వాహనం ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా, ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. స్థానికులు మరొకరిని మంటల […]
Telugu jawan martyred in firing : భారత్-పాక్ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. దేశ సరిహద్దు ప్రాంత్రాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతోంది. దీంతో భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ఆ క్రమంలో జమ్మూకశ్మీర్లో పాక్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు. మృతిచెందిన జవాన్ను మురళీనాయక్గా గుర్తించారు. ఇతడి స్వస్థలం ఏపీలోని రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లితండా. రేపు గ్రామానికి వీర జవాన్ పార్థివ […]
Gas cylinder explodes in Rajasthan : బంగారం దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలి 8 మంది మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ బికనీర్ జిల్లాలోని మదాన్ మార్కెట్ ఏరియాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిలిండర్ పేలుడు ధాటికి దుకాణం ఉన్న భవనం పూర్తిగా ధ్వంసం అయ్యింది. బంగారం దుకాణంలోని గ్యాస్ స్టవ్పై పాత బంగారం, వెండిని కరిగించేందుకు వ్యాపారి మరగబెడుతున్నాడు. ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయిందని […]
Road Accident : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం పరిధిలోని ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి వచ్చి కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు వెనుక సీట్లో కూర్చున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బీదర్ నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం క్షతగాత్రులను 108లో స్థానిక […]
Ranganayaka Sagar : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో మునిగి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతులను మిరాజ్ (15), అర్బాస్ (15)గా గుర్తించారు. వరంగల్కు చెందిన రెండు కుటుంబాలు హైదరాబాద్ వెళ్తున్నారు. మార్గమధ్యంలో రంగనాయక్ సాగర్ వద్ద రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఆగారు. ఈ క్రమంలోనే సరదాగా ఈత కొడుతున్నారు. దీంతో ఇద్దరు పిల్లలు నీట మునిగారు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు […]
Tirupati : తిరుపతి సమీపంలోని మంగళం పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు పడి ముగ్గురు మేస్త్రీలు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. తుడా క్వార్టర్స్లోని హెచ్ఐజీ విభాగంలో ప్లాట్ నం-63లో శ్రీకాళహస్తికి చెందిన ఆండాలయ్య ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు. భవన నిర్మాణానికి సంబంధించిన పనులను పెళ్లకూరు మండలం అక్కగారిపేటకు చెందిన బొటోతొట్టి శ్రీనివాసులు (40), ఒంగోలుకు చెందిన వసంత్, కె.శ్రీనివాసులు, కావలికి చెందిన మాధవ […]
Two Nursing Students Died : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిలబడిన విద్యార్థినులపైకి వాహనం దూసుకెళ్లింది. దీంతో మక్తల్కు చెందిన మహేశ్వరి, వనపర్తికి చెందిన మనిషా విద్యార్థినులు అక్కడికక్కడే మృతిచెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం సాయంత్రం కొందరు నర్సింగ్ విద్యార్థినులు కళాశాల నుంచి హాస్టల్కు వెళ్లేందుకు బస్టాప్లో నిలబడి ఉన్నారు. విద్యార్థినులపై బొలేరో వాహనం దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో వాహనం డ్రైవర్ పరారయ్యారు. […]
Tirupati Road Accident : ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప్ప రెడ్డి పల్లి ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు […]