Home / Congress
Congress: ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది. భేటీకి కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సఖ్విందర్ సింగ్ సుఖ్ సహా.. పలువురు నేతలు హాజరయ్యారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పహల్గాం దాడి తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులు, కులగణనకు కేంద్రం ఓకే చెప్పడంపై చర్చించారు. కాగా పహల్గాం దాడితో దేశంలో అలజడి […]
Ex-Union minister Girija Vyas dies in Fire Accident: కేంద్ర మాజీ మంత్రి, రాజస్థాన్ కాంగ్రెస్ నేత గిరిజా వ్యాన్(79) కన్నుమూశారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన ఆమెను రాజస్థాన్లోని అహ్మదాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పరిస్థితి మరింత విషమించడంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె మృతికి కాంగ్రెస్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శితో పాటు కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. వివరాల ప్రకారం.. ఉదయపూర్లోని తన నివాసంలో మార్చి 31వ తేదీన […]
May Day: ఈ నెల 7 సమ్మె దిగుతున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే సమ్మెపై కార్మికులంతా మరోసారి ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేడే సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంతాలతో సమ్మె చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి వస్తోందని.. ఇలాంటి సమయంలో తప్పుడు మాటలు నమ్మి సమ్మెకు వెళ్తే సంస్థకు భారీగా ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. కార్మికులకు […]
AP Congress: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఆమె నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా అమరావతి రాజధాని పునఃప్రారంభంతోపాటు పలు ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోదీ మే2న ఏపీకి రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని పర్యటనపై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. గతంలో 2015లో ఉద్దండరాయునిపాలెం వద్ద ప్రధాని మోదీ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన […]
KCR: ప్రతిపక్షనేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ సభలో కేసీఆర్.. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఆగాయంటూ చేసిన కామెంట్స్ పై సీఎం రియాక్ట్ అయ్యారు. కేటీఆర్, హరీశ్ రావు అడిగే ప్రశ్నలకే కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందని, అలాంటిది ప్రతిపక్షనేతగా తను అసెంబ్లీలో అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పగలదా అంటూ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. అసెంబ్లీకి రాను పిల్లలను పంపుతానని మాట్లాడుతున్నారు.. సభకు […]
CM Revanth Reddy : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సభపై సోమవారం సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రసంగం అక్కసుతో కూడుకున్నదని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు.. కేసీఆర్ ఖజానాను ఖాళీ చేసి తమపై నిందలు వేస్తారని అని మండిపడ్డారు. బీఆర్ఎస్ను […]
CM Revanth Reddy : జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపాటు మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, భారత్ సమ్మిట్కు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారీసంఖ్యలో నగరవాసులు పాల్గొని పహల్గాం మృతులకు సంతాపం తెలిపారు. మరోసారి పాక్ను ఓడించాలి.. దేశంలోని […]
Kharge : బీహార్లో జేడీయూ పార్టీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అది అవకాశవాద కూటమి అని దుయ్యబట్టారు. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పార్టీలు మారుతుంటారని ఆరోపించారు. బిహార్లోని బక్సర్లో నిర్వహించిన పార్టీ సభలో పాల్గొని మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పించాలని ప్రజలను కోరారు. బిహార్లో నితీశ్ కుమార్ పార్టీ, బీజేపీది అవకాశవాద పొత్తు అన్నారు. రాష్ట్ర ప్రజలకు […]
Ponnam Prabhakar : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో హామీ మేరకు ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేస్తూ భర్తీ చేస్తుంది. ఇప్పటికే 56 వేల ఉద్యోగాలు వివిధ శాఖల్లో భర్తీ చేసింది. తాజాగా ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. త్వరలో ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు రావాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ వెల్లడించారు. 3,038 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చిందని తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు. సాధ్యమైనంత […]
National Herald CASE : నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. గన్పార్క్ నుంచి బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఈడీ కార్యాలయం ఎదుట బైఠాయించిన నిరసన వ్యక్తంచేశారు. ధర్నాలో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, […]