Published On:

Neeraj Chopra: నీరజ్ చోప్రా పేరిట అరుదైన రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు

Neeraj Chopra: నీరజ్ చోప్రా పేరిట అరుదైన రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు

PM Narendra Modi Greetings to Neeraj Chopra New Record In Javelin Throw: జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా పేరిట అరుదైన రికార్డు నమోదైంది. దోహా డైమండ్ లీగ్‌లో సత్తా చాటి చరిత్ర సృష్టించాడు. దోహా వేదికగా జరిగిన జావెలిన్ త్రో పోటీల్లో భాగంగా నీరజ్ చోప్రా మొదటిసారి 90.23 మీటర్ల దూరం విసిరాడు. దీంతో అతని పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.

 

అంతకుముందు నీరజ్ చోప్రా 89.94 మీటర్లు మాత్రమే విసిరాడు. తాజాగా, ఆ వ్యక్తిగత రికార్డును తానే మెరుగుపరుచుకొని 90.23 మీటర్లు విసిరాడు. అయితే దోహా పోటీల్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. జర్మనీ ప్లేయర్ జులియన్ వెబర్ ఏకంగా 91.06 మీటర్లు విసిరడంతో తొలి స్థానం వరించింది.

 

అంతే కాకుండా 2024లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 87.58 మీటర్లు వీసిరి రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక, 2023లో ప్రపంచ ఛాంపియన్స్ షిప్స్‌లో 88.17 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. 2020 ఏడాదిలో జరిగిన ఒలింపిక్స్ కాంపిటీషన్స్‌లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు.

 

ఇదిలా ఉండగా, తొలిసారి 90 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రాను పలువురు అభినందిస్తున్నారు. ఈ తరుణంలో ప్రధాని మోదీ సైతం అభినందనలు తెలిపారు. వండర్ ఫుల్ ఫీట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. నీరజ్ చోప్రా క్రమశిక్షణ, అంకితభావం కారణంగా ఈ రికార్డులు నమోదవుతున్నాయని చెప్పాడు. ఈ ప్రదర్శనతో భారత్‌కు గర్వకారణమని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.