Home / ఆంధ్రప్రదేశ్
ఏపీ వ్యాప్తంగా రెండురోజులు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి . ఈ ఏడాది పడిన వర్షాలు ఏ ఏడాది కూడా పడలేదు . ఏవి ఆగిన వర్షాలు ఆగడం లేదు . ఈ ఏడాది ప్రకృతి తన విశ్వరూపం చూపిస్తుంది . రెండు రోజలకొకసారి వాతావరణం మారిపోతూనే ఉంటుంది . తెలుగు రాష్ట్రాల్లో, భారీ వర్షపాతం నమోదు ఐనందున ఎల్లో అలర్ట్ చేసినట్టు తెలిసిన సమాచారం .
టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం కుప్పం నియోజకవర్గంలో లో మూడో రోజు పర్యటిస్తున్నారు. కృష్ణానందపల్లి, గుండ్లనాయనపల్లి, కొత్తూరులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు తిరగబడితే సీఎం జగన్ బయట తిరగలేరన్నారు.
సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్కు ఊరట లభించింది. రోజువారీ విచారణకు హాజరు కావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. తనకు బదులు న్యాయవాది హాజరుకు అనుమతివ్వాలన్న జగన్ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది.
ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణలో భాగంగా, ఏపీలో ఇక నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. గుడ్డలతో చేసిన ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక పర్యావరణాన్ని రక్షిస్తూనే, ఆర్థిక పురోగతి సాధించాలని అన్నారు.
ఏపీలో ఈ ఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రక్రియను కన్వీనర్ పోలా భాస్కర్ షెడ్యూల్ ప్రక్రియను ఆగష్టు 22న విడుదల చేసారు. ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకు సంబంధించిన ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ వరుసగా నాలుగో ఏడాది సంక్షేమ పథకాలను అమలు చేసింది. సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం లబ్దిదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యింది. సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో డబ్బును జమ చేస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రవేశ పెట్టారు. కృష్ణా జిల్లా పెడనలో ఈ కార్యక్రం జరిగింది. పెడన వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను అందరిని ఆకట్టుకుంది. సీఎం జగన్ కూడా ఈ ఎగ్జిబిషన్ను చూసి తిలకించారు.
ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేయనున్నట్లు తెలిసిన సమాచారం. 2022 ఆగష్టు 3 నుంచి ఆగష్టు 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం మన అందరికి తెలిసిందే.
తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేడు చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించేశారు.