Published On:

Bangalore: సూట్ కేసులో మహిళ మృతదేహం.!

Bangalore: సూట్ కేసులో మహిళ మృతదేహం.!

Breaking News: బెంగళూరులోని చందపురలో రైల్వె పట్టాల దగ్గర గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యప్తు ప్రారంభించారు.  18ఏళ్ల యువతిగా గుర్తించారు. బెంగళూరులోని హోసూర్ మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న పాత చందపుర రైల్వే వంతెన సమీపంలో సూట్ కేస్ కనెగొనబడింది. అటుగా వెళ్తున్న వ్యక్తులు సూట్ కేస్ ను తెరిచి చూడగా అందులో శవం ఉన్నట్లు పోలీసులకు తెలిపారు.

సూట్ కేసును రైలులోంచి విసిరివేయబడి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని మారుమూల ప్రాంతంలో విసిరివేసే క్రమంలో జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

సూర్యనగర్ పోలీసులు ప్రాథమిక తనిఖీని పూర్తి చేశారు. రైల్వే పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. సూట్ కేసు రైలునుంచి పారవేసినట్లుగా కనిపిస్తుందని బెంగళూరు రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ సికె బాబా తెలియజేశారు. సాధారణంగా ఇటువంటి కేసులు రైల్వే పోలీసుల పరిధిలోకి వస్తాయని, అయితే ఘటన తమ ప్రాంతంలోనికి వస్తుంది కాబట్టి తాముకూడా ఇందులో పాల్గొన్నట్లు చెప్పారు. బాధితురాలని ఇంకా గుర్తించలేదని అన్నారు. ఎందుకంటే ఆవిడ గుర్తింపు కార్డులు, వస్తువులు ఏవీ లభించలేదన్నారు.

ఇవి కూడా చదవండి: