Published On:

S Jaishankar: చరిత్రలో కొత్త మార్పు…అఫ్గనిస్తాన్ తాలిబాన్ మంత్రికి జైశంకర్ ధన్యవాదాలు

S Jaishankar: చరిత్రలో కొత్త మార్పు…అఫ్గనిస్తాన్ తాలిబాన్ మంత్రికి జైశంకర్ ధన్యవాదాలు

S Jaishankar: ఇది చిత్రం, బలారే విచిత్రం. ఇప్పటివరకు చరిత్రలో జరగని చిత్రం. తాలిబాన్ లు అంటేనే ఒకప్పటి ఉగ్రవాదులు. అలాంటి వాళ్లు అఫ్గనిస్తాన్ ను హస్తగతం చేసుకుని పరిపాలిస్తున్నారు.  ఆగస్టు 2021లో అఫ్గనిస్తాన్ ను హస్తగతం చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అఫ్గనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రికి అమిర్ ఖాన్ ముత్తాఖీ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇది దేశ చరిత్రలో మొదటిసారి.

 

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని అఫ్గనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. ఇందుకుగాను జైశంకర్ అఫ్గన్ విదేశాంగ మంత్రికి ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని జైశంకర్ ఎక్స్ వేధికగా తెలిపారు. అయితే ఇప్పటివరకు అఫ్గనిస్తాన్ లో కొలువైన తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించలేదు. అయితే దౌత్య  సంబంధాలను మాత్రం కొనసాగిస్తుంది.

 

పాకిస్తాన్ ఎప్పటిలాగే భారత్ లో చిచ్చు పెట్టాలని చూసింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా చేసిన మిసైల్ దాడిలో కొన్ని మిసైల్లు అఫ్గన్ లో పడ్డాయని పాకిస్తాన్ ప్రచారం చేసింది. అందుకు ప్రతిగా అఫ్గనిస్తాన్ తమ భూభాగంలో భారత్ కు చెందిన క్షిపణులు పడలేదని చెప్పింది. పాక్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ఇందుకుగాను జైశంకర్ అఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ తో మాట్లాడారు.

 

“అఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిగాయి. ఆరోగ్యకరమైన పరిస్థితులకు నాంది పడింది. పహల్గాం ఉగ్రదాడిని అఫ్గన్ ఖండించడం సంతోషకరం. భారత్ – అఫ్గనిస్తాన్ ల మధ్య పాకిస్తాన్ చిచ్చు రాజేయాలని చూసింది. దాన్ని అఫ్గనిస్తాన్ ఖండించడం సంతోషాన్నిచ్చింది. అఫ్గనిస్తాన్ ప్రజలతో స్నేహసంబంధానికి భారత్ కట్టుబడి ఉంది. ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలి”అని జై శంకర్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఇక్కడ పాకిస్తాన్ జిత్తులమారితనం కనపడుతోంది. భారత్ ను కొట్టాలనుకున్న పాక్ కు భంగపాటు కలగబంతో ఇప్పుడు అఫ్గన్ కు భారత్ కు మధ్య చిచ్చు పెట్టి అప్గన్ తాలిబాన్ లను భారత్ పైకి ఉసిగొల్పాలని చూసింది. అయితే అఫ్గన్ పాకిస్తాన్ జిత్తులమారితనాన్ని పసిగట్టి తగిన బుద్ది చెప్పింది. అఫ్గనిస్తాన్ కు ఉన్న కనీస అవగాహన కూడా పాకిస్తాన్ కు లేకుండా పోయిందని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

s jaishankar speaks afghanistan taliban foreign minister amir khan

s jaishankar speaks afghanistan taliban foreign minister amir khan

 

2021లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడగా భారత్ ఇప్పటి వరకు వారిని అధికారికంగా గుర్తిచలేదు. కానీ దౌత్య సంబంధాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం జనవరిలో దుబాయ్ వేధికగా ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి చర్యలు జరిగాయి. ఇదిలాఉంటే, అప్గన్ లోని అల్ ఖైదా, ఐసిస్, తెహ్రిక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ వంటి ఉగ్రవాద సంస్థలపై భారత్ అన ఆందోళనను వ్యక్తం చేసింది.