Last Updated:

Farmers’ sons: రైతుల కొడుకులను పెళ్లి చేసుకునే మహిళలకు రూ.2 లక్షలు.. జేడీ(ఎస్) నేత హెచ్‌డి కుమారస్వామి

కర్ణాటక ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి సోమవారం మాట్లాడుతూ రైతుల కొడుకులను పెళ్లి చేసుకునే మహిళలకు తమ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షలు ఇస్తామని ప్రకటించారు. కోలార్‌లో జరిగిన 'పంచరత్న' ర్యాలీలో కుమారస్వామి ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు.

Farmers’ sons: రైతుల కొడుకులను పెళ్లి చేసుకునే మహిళలకు రూ.2 లక్షలు.. జేడీ(ఎస్) నేత హెచ్‌డి కుమారస్వామి

Farmers’ sons:కర్ణాటక ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి సోమవారం మాట్లాడుతూ రైతుల కొడుకులను పెళ్లి చేసుకునే మహిళలకు తమ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షలు ఇస్తామని ప్రకటించారు. కోలార్‌లో జరిగిన ‘పంచరత్న’ ర్యాలీలో కుమారస్వామి ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు.

అబ్బాయిల ఆత్మగౌరవం..(Farmers’ sons)

ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. రైతు బిడ్డల పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆడపిల్లలకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు.రైతుల కొడుకులను పెళ్లి చేసుకునేందుకు ఆడపిల్లలు సిద్ధంగా లేరని అన్నారు. అందువలన రైతు బిడ్డల పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆడపిల్లలకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని నాకు వినతిపత్రం అందింది. ఇది మన అబ్బాయిల ఆత్మగౌరవం అని కుమారస్వామి అన్నారు.

రాష్ట్రంలో మే 10న ఒకే దశలో పోలింగ్ జరగనుంది.మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.224 స్థానాలున్న అసెంబ్లీలో కనీసం 123 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న జేడీ(ఎస్) ఇప్పటి వరకు 93 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందు బీజేపీ రూ.16,000 కోట్ల రూపాయల విలువైన టెండర్‌లను జారీ చేయడంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ సోమవారం ఎన్నికల కమిషన్‌ను అభ్యర్థించింది.ఎన్నికల ప్యానెల్‌లోని ఆరేళ్లకు పైగా పూర్తి చేసిన కొంతమంది అధికారులను కర్ణాటక నుండి బదిలీ చేయాలని డిమాండ్ చేసింది. అలాంటి అధికారుల వివరాలను కూడా కాంగ్రెస్ అందించింది.రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై కర్ణాటక ఓటర్లలో అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్‌ ఐదు వీడియోలు రూపొందించింది.