Published On:

RBI: దేశంలో ఇంకా చలామణిలో రూ. 2 వేల నోట్లు.. విలువ ఎంతంటే?

RBI: దేశంలో ఇంకా చలామణిలో రూ. 2 వేల నోట్లు.. విలువ ఎంతంటే?

Currency: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన వెంటనే పాత రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో రూ. 2000, రూ. 500 నోట్లను ప్రవేశపెట్టింది. అలాగే కొత్తగా రూ. 200, రూ. 100, రూ. 50 నోట్లను కూడా ముద్రించింది. ప్రస్తుతం దేశంలో ఈ నోట్లే చలామణిలో ఉన్నాయి.

తర్వాత రెండేళ్ల కిందట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను కూడా వెనక్కి తీసుకుంది. అందుకు కొంత గడువు విధించింది. అయినా సరే దేశంలో ఇప్పటికీ రూ. 2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. రూ. 6266 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉండిపోయాయి. కాగా 2023 మే 19న రూ. 2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్బీఐ చెప్పింది. అప్పటివరకు దేశంలో రూ. 3.26 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. అయితే 2025 ఏప్రిల్ 30 నాటికి ఆ నోట్లు ఇంకా ఆర్బీఐకి చేరలేదని స్పష్టం చేసింది. మొత్తం రూ. 2 వేల నోట్లలో కేవలం 98.24 శాతం మాత్రమే తిరిగి వచ్చాయి.

కాగా 2023 అక్టోబర్ 9 నుంచి దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2000 నోట్లను స్వీకరిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఆ నోట్లను తెచ్చినవారు, సంస్థలు తమ అంకౌట్లలో నగదు జమ చేసుకోవచ్చని తెలిపింది.