Last Updated:

Kerala Blasts: యూట్యూబ్ లో చూసి పేలుడు పదార్దాలు తయారు చేసిన కేరళ పేలుళ్ల నిందితుడు

కేరళ ప్రార్దనా మందిరంలో పేలుళ్ల కేసులో నిందితుడు డొమినిక్ మార్టిన్, యూట్యూబ్ ట్యుటోరియల్స్ సహాయంతో పేలుడు పదార్థాలను తయారు చేయడం నేర్చుకున్నానని చెప్పాడు. కొచ్చిలోని తమ్మనంలోని తన అద్దె ఇంటి టెర్రస్‌పై మరియు అలువా సమీపంలోని పూర్వీకుల ఇంటిపై ట్రయల్స్ నిర్వహించినట్లు పోలీసులకు చెప్పాడు.

Kerala Blasts: యూట్యూబ్ లో చూసి పేలుడు పదార్దాలు తయారు చేసిన కేరళ పేలుళ్ల నిందితుడు

Kerala Blasts: కేరళ ప్రార్దనా మందిరంలో పేలుళ్ల కేసులో నిందితుడు డొమినిక్ మార్టిన్, యూట్యూబ్ ట్యుటోరియల్స్ సహాయంతో పేలుడు పదార్థాలను తయారు చేయడం నేర్చుకున్నానని చెప్పాడు. కొచ్చిలోని తమ్మనంలోని తన అద్దె ఇంటి టెర్రస్‌పై మరియు అలువా సమీపంలోని పూర్వీకుల ఇంటిపై ట్రయల్స్ నిర్వహించినట్లు పోలీసులకు చెప్పాడు.

పేలుళ్లకు అయిన ఖర్చు రూ.3,000..(Kerala Blasts)

ఆదివారం ఉదయం తమ్మనంలోని తన ఇంటి నుంచి బయలుదేరిన మార్టిన్ తన పూర్వీకుల ఇంటి నుంచి కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు.పేలుళ్లకు టిఫిన్ బాక్సులను ఉపయోగించారని గతంలో పోలీసుల వాదనను తోసిపుచ్చుతూ, పేలుడు పదార్థాలను ఆరు ప్లాస్టిక్ ప్యాకెట్లలో ఉంచి రిమోట్‌తో ఆపరేట్ చేశానని తెలిపాడు. బ్యాగుల్లో పెట్రోల్ నింపిన బాటిళ్లను కూడా ఉంచినట్లు మార్టిన్ విచారణాధికారులకు తెలిపాడు.పేలుళ్లకు డిటోనేటర్లను ఉపయోగించాడు. త్రిపుణితురలోని ఓ దుకాణం నుంచి కొనుగోలు చేసిన 50 హైపవర్ క్రాకర్స్‌ను కూడా ఐఈడీతో పాటు పేల్చేందుకు ఉపయోగించినట్లు చెప్పాడు.మార్టిన్ మొత్తం ఆపరేషన్ కోసం దాదాపు రూ.3,000 ఖర్చు చేశానని తెలిపాడు. పేలుళ్ల సమయంలో అతని అత్తగారు కూడా ప్రార్థన మందిరంలో ఉన్నారు. అయితే ఆమెప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆదివారం ఉదయం 7 గంటలకు అలువాలోని తన పూర్వీకుల ఇంట్లో పేలుడు పదార్థాలను తయారు చేసి అమర్చినట్లు తెలిపారు. హాలులో పేలుడు పదార్థాలను అమర్చినప్పుడు ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉన్నారని తెలిపారు.

ఎందుకు చేసాడంటే..

మార్టిన్ డొమినిక్ యెహోవాసాక్షులకు పాఠం నేర్పాలని కోరుకున్నాడని, అందుకే అతను దాడి చేయాలని నిర్ణయించుకున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.మార్టిన్ డొమినిక్, యెహోవాసాక్షులకు సామీప్యత కారణంగా ఎవరూ అనుమానించలేదు, జాతీయ గీతం పాడకపోవడం లేదా జాతీయ జెండాను ఎగురవేయకపోవడం, క్రిస్మస్ జరుపుకోకపోవడం మరియు ఇతర క్రైస్తవులను గుర్తించకపోవడం వంటి వారి విచిత్రమైన స్టాండ్‌ల కారణంగా క్రైస్తవ శాఖతో విసిగిపోయాడు. వారికి గుణపాఠం చెప్పాలనే తాను ఈ విధంగా చేసానని అతను వెల్లడించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.