Published On:

Flights: విమాన ప్రయాణికులకు అలర్ట్.. ఏవియేషన్ శాఖ కీలక సూచనలు

Flights: విమాన ప్రయాణికులకు అలర్ట్.. ఏవియేషన్ శాఖ కీలక సూచనలు

Rains: అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. అలాగే ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కర్నాటక, మహారాష్ట్రలో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో జనజీవనం స్తంభించింది. చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.

 

రైళ్లు, రవాణాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు ముందు జాగ్రత్తగా పలు రైలు సర్వీసులను రద్దు చేశారు. తాజాగా విమానయాన సంస్థ వర్షాలపై స్పందించింది. ఆయా రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా విమాన రాకపోకల్లో ఆలస్యం ఉంటుందని ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికులను హెచ్చరించింది. కాగా మార్చిన విమాన షెడ్యూల్ ను వెబ్ సైట్లో చెక్ చేసుకోవాలని సూచించాయి. గోవాలో భారీ వర్షం పడటంతో విమాన సర్వీసులు నిలిచిపోనున్నాయని తెలిపింది.

 

మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, గోవాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో మరింత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

 

Image