Published On:

Karregutta: మావోయిస్టులకు జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు

Karregutta: మావోయిస్టులకు జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు

Karregutta: తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో జవాన్లకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి (operation kagar). బీజాపూర్ సరిహద్దు కర్రెగుట్టల్లో 14వ రోజు ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఐఈడీ పేలుడులో ముగ్గురు ఎస్టీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. ప్రమాదం నుంచి మరొ ఇద్దరు మావోయిస్టులు తప్పించుకున్నారు. బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో జవాన్లు చికిత్స పొందుతున్నారు.

 

అటు జవాన్ల డ్రోన్‌కి మావోయిస్టులు చిక్కారు. ఉసూరు- సీతాపూర్ మధ్య మావోయిస్టుల జాడను గుర్తించారు. కూంబింగ్ పార్టీని హతమార్చేందుకు ఐఈడీ అమర్చి వెళుతున్నట్లుగా భద్రతా బలగాలు గుర్తించాయి. 40 నుంచి 60 మందికిపైగా మావోయిస్టులు ఉన్నారని నిర్ధారించారు. మావోలు బాసగూడ వైపు వెళ్తున్నారని తెలుస్తోంది. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులు భారీగా మృతిచెందే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: