Published On:

EPFO 3.o Launching Soon: పీఎఫ్ లో భారీ మార్పులు.. ఆన్ లైన్ లో అన్ని మార్పులు చేసుకోవచ్చు ఇలా..!

EPFO 3.o Launching Soon:  పీఎఫ్ లో భారీ మార్పులు.. ఆన్ లైన్ లో అన్ని మార్పులు చేసుకోవచ్చు ఇలా..!

EPF Money withdraw with ATM Card: ఒకప్పుడు ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ ను పొందడానికి నానా ఇబ్బందులు పడేవారు. ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరిగేవారు. గంటల తరబడి లైన్లలో నిలబడి పెద్ద పెద్ద ఫాంలను నింపి ఇచ్చేవాళ్లు. అందులో ఏదైనా తప్పుగా రాసినట్లయితే మళ్లీ సీన్ రిపీట్ అయ్యేది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వీటన్నింటినీ మార్చి వేసింది. ఇప్పుడు పీఎఫ్ తీసుకోవాలంటే క్షణాల్లో పని.

 

ప్రావిడెంట్ ఫండ్ 3.0 రానుంది. ఇకపై ఉద్యోగస్థుల ప్రావిడెంట్ ఫండ్ ను ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO) త్వరలో EPFO 3.0ను ప్రారంభించనుంది. ఇందులో ఆటోమెటిక్ క్లెయిమ్, ఆన్ లైన్ దిద్దుబాటులు, ATM ఉపసంహరణలు ఉండనున్నాయి. ఈ వ్యవస్థ మే – జూన్ 2025మధ్య అందుబాటులోకి రానుందని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.

 

EPFO 3.0లో తొమ్మిది కోట్లకు పైగా ఉద్యోగులు ఉన్నారన్నారు మన్సుఖ్. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త సౌకర్యలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఉద్యోగస్థుల ఆటోమెటిక్ క్లెయిమ్స్, సెటిల్మెంట్స్, తప్పులను సరిదిద్దడంతో పాటు ఏటీఎం నుంచి నేరుగా డబ్బులు డ్రా చేసుకునే సౌకర్యం ఉందనుంది. ఇంతకు ముందులా ప్రతీ చిన్న పనికి పీఎఫ్ ఆఫీస్ వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. క్షణాల్లో అదీకూడా ఇంట్లోంచే ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

 

పీఎఫ్ ను ఉపసంహరించుకోవడం EPFO 3.0 లో చాలా సులభం, వేగవంతం. క్లెయిమ్స్ ను స్వయంగా చేసుకోవచ్చు. మ్యాన్యువల్ గా వెళ్లాల్సిన పని లేదు. మీరు చేసిన క్లెయిమ్ ఆన్ లైన్ లో ఆమోదించిన వెంటనే ఏటీఎం ద్వారా మీ ధనాన్ని మీరు తీసుకోవచ్చు.

 

డిజిటల్ కరెక్షన్… మీ ఇంటి నుంచే మీ పీఎఫ్ ఎకౌంట్ లో ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఆన్ లైన్ లో సరిచేయవచ్చు. ఇది మ్యాన్యువల్ గా వెళ్లి గంటల తరబడి లైన్లలో నిలబడి ఫారమ్ లు నింపే ఇబ్బందిని తొలగిస్తుంది.

 

సామాజిన భద్రతా పథకాలను ఒకటిగా చేయడం… EPFO 3.0 ఇప్పుడు అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ బీమా యోజన వంటి ఇతర సామాజిక భద్రతా పథకాలను ఇందులో చేర్చాలని పరిశీలిస్తున్నారు. దీంతో అసంఘటిత, అనధికార కార్మికులు కూడా పెన్షన్, భద్రత యొక్క మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు.

 

పీఎఫ్ లోని మనీని తీసుకోవడానికి కేవలం OTP ద్వారా పొందవచ్చు. ఇంతకుముందులా పెద్ద పెద్ద ఫాం లను నింపి నిరీక్షించే పని లేదు.

 

గతకొన్నినెలలుగా రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులకు పీఎఫ్ ఎమౌంట్ ను తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని మార్గాలను సులభతరం చేయడానికి శ్రమించింది. ఇటీవలే CPPS కేంద్ర పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించింది. ఇప్పుడు వారు ఏబ్యాంకు నుంచైనా తమ పెన్షన్ ను తీసుకోవచ్చు. ఇది చారిత్రాత్మక మార్పని కేంద్ర మంత్రి మాండవీయ అన్నారు.

 

 

ఇవి కూడా చదవండి: