Home / ఆంధ్రప్రదేశ్
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ నారా లోకేష్ తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వచ్చే నెల 4వ తేదీ వరకు లోకేష్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.
త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. విజయవాడలో వరుసగా అయిదో ఏడాది వాహనమిత్ర నిధులను సీఎం జగన్ ఈరోజు విడుదల చేశారు. ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ నడుపుతూ జీవినం సాగించే వారి కోసం ఆర్థిక సాయం అందించేందుకు జగన్ సర్కార్ 2019లో వైఎస్సార్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుకి సంబంధించిన వాదనలు జరుగనున్నాయి. ఢిల్లీలో లాయర్లతో నారా లోకేష్ సంప్రదింపులు జరపాల్సి ఉంది.
భరత జాతి చైతన్యమూర్తి భగత్ సింగ్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భరత జాతిలో పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు షహీద్ భగత్ సింగ్ను ఆసేతు హిమాచలం గుండెల్లో పెట్టుకుందన్నారు. తెల్లవారి దాష్టీకాలను ఎదిరించిన ఆ వీరుని జయంతి సందర్భంగా సభక్తికంగా అంజలి ఘటిస్తున్నానని పవన్ తెలిపారు.
ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్పై హోంమంత్రి అమిత్ షాకు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సిఐడి చీఫ్ సంజయ్ సర్వీస్ రూల్స్ అన్నీ ఉల్లంఘించారంటూ ఆధారాలు సమర్పించారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి సిఐడి చీఫ్ సంజయ్ వైసీపీకి తొత్తుగా పనిచేస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు పాలకపక్షం, మహిళా కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ తరుపున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డల అదృశ్యం గురించి
తెదేపా చీఫ్ చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ అక్టోబర్ 5 వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. బుధవారం నాడు ఏసీబీ కోర్టు ప్రారంభం అయిన తర్వాత సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సాగుతున్నందున కొంత సమయం ఇవ్వాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారిస్తున్న ధర్మాసనం దీనిని మరో బెంచ్ వద్దకు బదిలీ చేసింది. ధర్మాసనం లోని జడ్జి ఎస్వీ భట్టి ఈ కేసు విచారణకు విముఖత చూపారు.
అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డు కేసులో తనకి ముందస్తు బెయిలివ్వాలంటూ టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఇన్నర్ రింగురోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి అనుచిత లబ్ధి పొందారని సిఐడి అధికారులు నారా లోకేష్ని కూడా నిందితుడిగా చేర్చారు.
చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి చంద్రబాబు అన్నారని ఇప్పుడు బెయిల్కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవని ప్రకటించిన లోకేష్.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారు.