Published On:

Road Accident: ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదాలు.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం

Road Accident: ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదాలు.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం

Five Dead Road Accident in andhrapradesh ongole dist: ఏపీలో ఆదివారం ఉదయాన్నే ఒకే సమయంలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీంతో రహదారులు రక్తమోడాయి. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు మండలంలోని కొప్పోలు సమీపంలో ఓ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. అయితే బోల్తాపడిన ఈ లారీని అదే సమయంలో మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.

 

ఇదిలా ఉండగా, రెండు లారీలు ప్రమాదానికి గురి కావడంతో ఆ రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ ట్రాఫిక్‌లో నిలిచి ఉన్న ఓ కారును వెనుక నుంచి మరో లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు చనిపోయారు. మృతులు పావని(25), కౌశిక్(14)గా గుర్తించారు. ఈ కారులోని వారు గుంటూరు నుంచి తిరుమలకు వెళ్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగినే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే తొలుత కోడిగుడ్ల లారీ అదుపు తప్పి కిందపడడంతో ముగ్గురు చనిపోయారని తెలిపారు. ఆ తర్వాత మరో లారీ ఢీకొట్టగా కొంతమంది గాయాలపడ్డారు. ఈ సమయంలో ట్రాఫిక్ అంతరాయంలో చిక్కుకున్న ఓ కారును మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు.

 

ఈ రెండు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. లారీ ప్రమాదంలో చనిపోయిన వివరాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.