Home / తాజా వార్తలు
ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2023 సీజన్-16లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన 163 పరుగుల లక్ష్యాన్ని.. 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సులువుగా ఛేదించింది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం.
దగ్గుబాటి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దగ్గుబాటి రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు అకాల మృతి వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రకాశం జిల్లా, కారంచేడులోని స్వగృహంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు.
" సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " మృణాల్ ఠాకూర్ " . మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ..
అమెరికాలో చరిత్ర లోనే ఆ దేశ మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోర్న్స్టార్కు అక్రమ చెల్లింపుల కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. అధికారులు ఆయనను జైలుకి తరలించారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు అక్రమ చెల్లింపుల కేసుల డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్టు అయ్యారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం అర్థరాత్రి కరీంనగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి బండిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి మనసు లోని కోరికలు నెరవేరుతాయని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 5 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకుండా.. ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. జనసేనను రాష్ట్రంలో సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా అడుగులు వేస్తామని పనవ్ అన్నారు.
కష్టాల్లో ఉన్న తన పర్యాటక రంగాన్ని పెంపొందించడానికి శ్రీలంక తన పొరుగు దేశం భారతదేశం వైపు చూస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో, రామాయణ సర్క్యూట్ భారతదేశం నుండి అనేక మంది పర్యాటకులను ఆకర్షించగలదని శ్రీలంక వాసులు గ్రహించారు మరియు వారు దానిని చురుకుగా ప్రచారం చేస్తున్నారు.
DC vs GT: ఐపీఎల్ లో నేడు మరో పోరుకు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికైంది. గుజరాత్ టైటాన్స్, దిల్లీ జట్టు మధ్య నేడు పోటి జరగనుంది. ఇక ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.