Home / తాజా వార్తలు
మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు సంబంధించి మరో లేఖ విడుదల చేసాడు.
తన ఫిట్ నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేతో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ కు అతనితో నిశ్చితార్థం జరిగింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 7 నుంచి 29వ తేదీ వరకు ఉభయ సభల శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా టీబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు.
ఏపీలో మందుబాబులకు శుభవార్త అందింది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు. అాంటే బీజేపీ కండువా కప్పుకుని ఫోటో ఇవ్వడం తప్ప మిగిలిన ఫార్మాలిటీలు అన్ని పూర్తయినట్లే. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్రి శశిధర్ రెడ్డి కలిసారు.
అయ్యప్ప దర్శనానికి వెళ్లివస్తోండగా కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వస్తోన్న ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలు అయ్యాయని అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది.
అక్రమ నగదు చలామణీ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సత్యేందర్ జైన్ జైలు పాలయిన విషయం విధితమే. కాగా తాజాగా ఆయన ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటూ సర్వ సుఖాలు అనుభవిస్తున్నారంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది.
ప్రెగ్నెంట్ అంటూ తనపై వస్తోన్న వార్తలపై కోలీవుడ్ ప్రముఖ నటి నిక్కీ గల్రానీ స్పందించారు. ఆమె గర్భం దాల్చిందని, త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ తరుణంలో వాటిపై నిక్కీ స్పందించారు. అవి రూమర్లంటూ కొట్టిపడేశారు. 'డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి' అంటూ కౌంటర్ వేశారు.
ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.