Home / తాజా వార్తలు
తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత మహిళా నేతలను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి నారా లోకేష్ ఖండించారు. నిత్యం నోటికొచ్చినట్లు మాట్లాడే కొడాలి నానిని ఎన్నిస్లారు అరెస్ట్ చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
మాజీ మంత్రి, మర్రి శశిధర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
గత లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత గెలిస్తే తమ పై పెత్తనం చేస్తుందని వారు భావించారని అందుకే వారు ఓడగొట్టారని అన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యక్తిగత సహాయకుడు హనీ ట్రాప్లో చిక్కుకున్నారని, అతని నుంచి రహస్య పత్రాలను సేకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
తమిళ స్టార్ హీరో ధళపతి విజయ్ 'వారసుడు' సినిమా టాలీవుడ్, కోలీవుడ్ మధ్య చిచ్చు రేపుతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న ఫుట్బాల్ టోర్నమెంట్, ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ లో ఆదివారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతోంది.
ట్విట్టర్ బ్లూ బర్డ్ లాగానే సేవలు అందిస్తుంది దేశీయ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘కూ'. అయితే ఇప్పుడు ట్విట్టర్ నుంచి తొలగించబడిన ఉద్యోగులకు తమవైపు ఆకర్షించే పనిలో పడింది.
ప్రధాని మోదీ శనివారం అరుణాచల్ ప్రదేశ్లోని ఇటానగర్లో మొదటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం, డోనీ పోలో ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు. 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్ను అంకితం చేశారు. ఫిబ్రవరి 2019లో ఆయన విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు.
ఇటీవల కాలంలో ఫుడ్ బిజినెస్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదనుకోండి. దానిని ఆసరాగా చేసుకుని కొంత మంది వ్యాపారులు నాణ్యతప్రమాణాలు లేకుండా అడ్డగోలుగా అమ్మకాలు జరుపుతున్నారు. దీనిపై ఆహార పరిరక్షణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆహార నాణ్యత విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిపై మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ వాళ్లు దాడి చేసినపుడు ఎక్కడికి పోయారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు