Home / తాజా వార్తలు
ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నడిరోడ్డుపైనే జుట్టుజుట్టు పట్టుకుని పొట్టుపొట్టున కొట్టుకున్నారు. వారి స్నేహితులు ఇద్దరిని విడదీసేందుకు ప్రయత్నించినా వారు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్లోని గంగాపూర్ రోడ్డులోని ఓ కళాశాలలో చోటుచేసుకుంది.
కేరళలోని కొచ్చిలో కామాంధులు రెచ్చిపోయారు. రన్నింగ్ కారులో 19 ఏళ్ల మోడల్ పై అత్యాచారానికి ఒడిగట్టారు. గురువారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా 'ఇదేం కర్మ' అనే కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టబోతోంది.
ఆనందంగా జరుగుతున్న ఓ పుట్టిన రోజు వేడుక చివరికి విషాదంగా ముగిసింది. వేడుకలకు హాజరయ్యి 21 మంది సజీవదహనం అయ్యారు. అందులో 17 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం ఆవేదనకరం. ఈ దుర్ఘటన పాలస్తీన గాజాలోని శరణార్థుల శిబిరంలో చోటుచేసుకుంది.
ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీస్ లో టీమిండియా ఘోర పరాభవం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇటు క్రికెట్ లవర్స్ తో పాటు దేశప్రజలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టులో కీలకమార్పులు ఉంటాయని అంతా భావించగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది.
పలుకేసుల్లో వివిధ మంత్రులకు కోర్టులు ఇటీవల కాలంలో అరెస్ట్ వారెంట్ జారీ చెయ్యడం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ కు కళ్యాణదుర్గం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరోవైపు చోరీ కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన రెండు రోజులకే మరో కేంద్ర మంత్రికి పశ్చిమ బెంగాల్లోని ఓ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఉత్తరాఖండ్లోని జోషిమత్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా కనీసం 12 మంది మరణించారు.
సుమారు రూ.300 కోట్ల అవకతవకలు జరిగి అక్రమాల పుట్టగా మారిన చిత్రపురి హోసింగ్ సొసైటీ పై సీబీఐ విచారణ జరిపించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ డిమాండ్ చేసారు.
కర్నూలులో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. ఉదయం రాజ్ విహార్ సర్కిల్ సమీపంలోని మౌర్య ఇన్ హోటల్ లో జరిగిన చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని న్యాయవాదులు అడ్డుకునేందుకు యత్నించారు.
ఫిఫాప్రపంచ కప్కు కేవలం రెండు రోజులు మాత్రమే సమయముంది. ఈ మ్యాచ్లు జరిగే స్టేడియంలలో బీర్ అమ్మకాలను ఖతార్ నిషేధించింది. అంతకుముందు, అధికారిక స్పాన్సర్ బడ్వైజర్ ఖతార్ ప్రపంచ కప్ అధికారిక వేదికలలో బీర్ విక్రయించడానికి అనుమతించబడింది.