Home / తాజా వార్తలు
" బింబిసార " సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టరుగా నిలిచింది. బ్లాక్బాస్టర్ హిట్ టాక్తో సక్సెస్ ఫుల్గా బాక్సాఫీసు వద్ద ఫుల్ రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త ఆప్టేట్ వచ్చింది .
ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజీస్టు , మోటివేషనల్ స్పీకర్ , స్టోరీ టెల్లర్, సహజ ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు శైలజ విస్సంశెట్టి గారు ఎంతో మందికి సహాయం చేశారు. పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక బడికి పంపించకుండా పిల్లలను ఇంటి దగ్గరే ఉంచిన తల్లితండ్రులు ఇంకా ఉన్నారని ...అలాంటి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలకు చదువుకు మించిన పెద్ద బహుమతి ఏమి ఇవ్వలేమని సహజ ఫౌండేషన్ శైలజ విస్సంశెట్టి గారు పలు సార్లు పలు కార్యక్రమాల్లో ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 502 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ సమాచారాన్ని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు.
బిల్కిస్ బానో కేసులో ప్రమేయం ఉన్న 11 మంది దోషుల విడుదలను రద్దు చేయాలని మహిళా హక్కుల కార్యకర్తలు మంగళవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇది సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసు కాబట్టి దోషులను విడుదల చేయరాదని పిఐఎల్లో పేర్కొన్నారు.
ఆసియ కప్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. భారతజట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో ఆసియాకప్ కు ద్రావిడ్ దూరమయినట్లే.
హరారే వేదికగా జరిగిన చివరి వన్డేలో 13 పరుగుల తేడాతో జింబాబ్వే పై విజయం సాధించి భారత్, మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే తొలి రెండు వన్డేల్లో పోరాట పటిమ చూపించని జింబాబ్వే చివరి వన్డేలో మాత్రం అద్భుత పోరాటం చేసి ఔరా అని పించింది.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకురాలు మరియు నటి సోనాలి ఫోగట్ సోమవారం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఉత్తర గోవాలోని ఎస్టీ ఆంటోనీ ఆస్పత్రి నుంచి సోనాలి ఫోగట్ మృతి గురించి పోలీసులకు సమాచారం అందింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం సమావేశం అయిన విషయం తెలిసిందే. వీరిద్దరి సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి భేటీ పై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఫీనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫీనిక్స్ ఛైర్మన్లు, డైరక్టర్ల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తుంది ఫీనిక్స్ సంస్థ.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా, జనగామ జిల్లాలో పాదయాత్రలోనే బండి సంజయ్ దీక్షకు దిగేందుకు సిద్దమైయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీక్షకు దిగుతుండగా అరస్ట్ చేశారు.