Home / ప్రాంతీయం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ.. తెలంగాణ మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేశారు. ఐదు న్యాయాలు-తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో మేనిఫెస్టోను రూపొందించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్, దానం నాగేందర్, రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం దాల్చుతున్నాడు. నిన్న ఏపీలో అత్యధికంగా 47 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లాలోని ఎండ్రపల్లిలో రికార్డ్ స్థాయిలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మార్కాపురంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఆయన కుమార్తె క్రాంతి షాకిచ్చారు. ముద్రగడను వ్యతిరేకిస్తూ.. పవన్ కళ్యాణ్కు మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు. తన తండ్రి వైఖరిని తాను వ్యతిరేకిస్తున్నానని, పిఠాపురంలో జనసేన గెలుపుకు పాటు పడతానని చెప్పారు.
జగన్ సిద్ధం అంటూ ఎందుకొస్తున్నాడు? మద్యం ధరలు పెంచినందుకా? ఎందరో మహిళలు కనిపించకుండా పోయారు అందుకా? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో పవన్ ప్రసంగించారు.
ఈ నెల 3వ తేదీ సాయంత్రం 8 గంటలకు .గడువు ముగిసిన తర్వాత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర, యదావిధిగా సాగనుంది. కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు మేరకు ఎన్నికల కమీషన్ కేసీఆర్ ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
కేసీఆర్ 48 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించిన ఎన్నికల సంఘం కాంగ్రెస్కు వ్యతిరేకంగా అవమానకరమైన మరియు అభ్యంతరకరమైన ప్రకటనలు చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు బుధవారం రాత్రి 8 గంటల నుండి 48 గంటల పాటు ప్రచారం చేయకుండా భారత ఎన్నికల సంఘం నిషేధించింది.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ కు నవసందేహాలు పేరుతో మరో లేఖ రాసారు. ఈ లేఖలో రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో తాను అడుగుతున్న సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.షర్మిల రాసిన లేఖలో అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
ఇటీవల కూరలో ఉప్పు ఎక్కువైందని భార్యను చంపిన భర్త ఉదంతం మరవక ముందే అలాంటిదే మరో సంఘటన తాజాగా జరిగింది. వంట రుచిగా చేయలేదని ఓ వ్యక్తి భార్యతో గొడవపడి ఆమెను హతమార్చిన సంఘటన హైదరాబాద్ లోని, బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
న్నికల వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రది మోదీ పై విరుచుకు పడుతున్నారు .మోదీ తెలంగాణకు చేసింది ఏమి లేదు గాడిద గుడ్డు అంటూ సెటైరికల్ గా ప్రచారం చేతున్న రేవంత్ రెడ్డి తాజాగా మరో సారి హాట్ కామెంట్స్ చేసారు . రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
గాజు గ్లాసు సింబల్పై జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించింది….. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జనసేన. ఆ పిటిషన్ పై నిన్న, ఈ రోజు కూడా వాదనలు జరిగాయి.. అయితే, నిన్న హైకోర్టును 24 గంటల సమయం కోరిన ఎన్నికల కమిషన్.. ఈ రోజు కీలక విషయాలను వెల్లడించింది..