Published On:

Navodaya 2026: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నవోదయ నోటిఫికేషన్ రిలీజ్

Navodaya 2026: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నవోదయ నోటిఫికేషన్ రిలీజ్

Jawahar Navodaya Vidyalaya Admission Notification 2026 Released: విద్యార్థులకు గుడ్ న్యూస్. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో 6వ తరగతి సీట్లను భర్తీ చేసేందుకు జేఎన్‌వీఎస్‌టీ 2026 పరీక్షను 2 విడతలుగా నిర్వహించనున్నట్లు తెలిపింది.

 

ఈ మేరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు జులై 29 వరకు అవకాశం కల్పించారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 13న ఉదయం 11.30 నిమిషాలకు పరీక్ష జరగనుంది. అలాగే జమ్మూ కశ్మీర్ వంటి పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పరీక్ష జరగనున్నట్లు తెలిపారు.

 

ఇక, తెలుగు రాష్ట్రాల్లో నవోదయ పరీక్షకు విపరీతంగా పోటీ ఉంటుంది. దేశ వ్యాప్తంగా మొత్తం 654 నవోదయ పాఠశాలలు ఉండగా.. ఏపీలో 15, తెలంగాణలో 9 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 80 ప్రశ్నలకు 100 మార్కులు ఇవ్వనున్నారు.

అభ్యర్థులు https://cbseitms.rcil.gov.in/nvs/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనన ధృవీకరణ పత్రంతో పాటు నివాస ధృవీకరణ పత్రం, 5 వ తరగతి చదువుతున్నట్లు బోనఫైడ్, విద్యార్థి, తల్లిదండ్రుల ఫోటో, సంతకం, కులం, ఆదాయం సర్టిఫికెట్ అవసరం ఉంటుంది.

ఇవి కూడా చదవండి: