Home / ఎడ్యుకేషన్ & కెరీర్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం గ్రేస్ మార్కులు ఇచ్చిన 1,563 NEET-UG 2024 అభ్యర్థుల స్కోర్కార్డ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. NEET ఫలితాలపై సుప్రీంకోర్టులో విచారణ సందర్బంగా ఎన్ టీ ఏ ఈ విషయాన్ని తెలియజేసింది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ అండర్గ్రాడ్యుయేట్ (NEET UG) 2024 ఫలితాలు తీవ్ర వివాదంగా మారాయి. నీట్ పరీక్షలు మొదలైన తర్వాత నుంచి పలు వివాదాలు చుట్టుముట్టాయి. వాటిలో పేపర్ లీక్ కావడం ఒక ఎత్తైతే.. ఇష్టం వచ్చినట్లు మార్కులు ఇచ్చారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఏపీ ఈసెట్ 2024 - ( ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాలు విడుదల అయ్యాయి. అనంతపురం జేఎన్టీయూ లోఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఈసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈసెట్ ఫలితాలలో బాలికలు 93.34 శాతం, బాలురు 89.35 శాతం విద్యార్ధుల ఉత్తీర్ణత సాధించారు.
తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAPCET) 2024 ఫలితాలు శనివారం ప్రకటించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వారిలో 1,80,424 మంది (74.98 శాతం) ప్రవేశానికి అర్హత సాధించారు.
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ ఫలితాలను విడుదల చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 3వేల7వందల 43 పరీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. ఇందులో మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న సివిల్స్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకం అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు జగనన్న సివిల్స్ ప్రోత్సాహక పథకం ప్రవేశపెడుతూ విధివిధానాలతో జీవో ఎంఎస్ 58 ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఈ ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. ఈ నెల 15న టెట్ అర్హత పరీక్షను తెలంగాణ విద్యా శాఖ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ టెట్ లో అర్హత సాధిస్తే జీవిత కాలం వర్తిస్తుంది. ఈసారి టెట్ ఫలితాలతో పాటు ఫైనల్ కీ కూడా విడుదల చేశారు.
ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త.. గ్రాడ్యుయేట్ మెడికల్ డాక్టర్లు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి విదేశాలలో వారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొనసాగించవచ్చు. అంతేకాదు వారు అక్కడ ప్రాక్టీసు కూడా చేయవచ్చు
యూకే లో మెడిసిన్ చదువుదామనుకునే వారికి ముఖ్యంగా వచ్చే ఏడాది అడ్మిషన్లు కోరుకునే వారు వెంటనే అప్లై చేసి ప్రవేశ పరీక్షకు సిద్దమవ్వాలి. ఈ పరీక్షను UCAT అంటారు. అంటే యూకే క్లినికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ .. యూకేలోని 35 కాలేజీల్లో ఎంబీబీఎస్ చదువాలనుకునే విద్యార్దులు 2024 విద్యా సంవత్సరానికి ఈ ఏడాది జూన్ 20న నోటిఫికేషన్ జారీ అయింది.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).. దేశ వ్యాప్తంగా 20 యూనివర్సిటీ లను ఫేక్ యూనివర్సిటీ లుగా గుర్తించింది. కాగా ఆయా విశ్వవిద్యాలయాలకు డిగ్రీలు ప్రధానం చేసే అధికారం లేదని ప్రకటించింది. ఆ యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలతో ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని తేల్చేసింది.