Home / ఆంధ్రప్రదేశ్
తెలుగుదేశం యువనేత జనరల్ సెక్రటరీ నారా లోకేష్ మరోసారి యువగళం యాత్ర చేపట్టనున్నారు. గతంలో కుప్పం నుంచి విశాఖ వరకు యువగళం పాదయాత్ర ద్వారా శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిన లోకేష్ ... ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మిగిలిన ప్రాంతాలలో పర్యటించనున్నారు . ఏప్రిల్ 30 న ఒంగోలు నుంచి మలివిడత యువగళం యాత్ర ప్రారంభించి మే 6న ముగించనున్నారు.
ఏపీలో ఎన్నికల నేపధ్యంలో అనేక విషయాలపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శ ప్రతివిమర్శలు పొడచూపుతున్నాయి .తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విస్తృత మైన చర్చ జరుగుతోంది. ఆ చట్టం ద్వారా రైతుల భూములు, ఆస్తులు లాక్కునేందుకు కుట్రపన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29 న ఈ చట్టం పై రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు.
చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.
: సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈసారి కేవలం రెండు పేజీలతో, 9 ముఖ్యాంశాలతో మేనిఫెస్టోని విడుదల చేయడం విశేషం . మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామని ఈ సందర్భంగా జగన్ అన్నారు.. ఇచ్చినమాట నిలబెట్టుకుని హీరోగా ఉండాలనుకున్నా. చెప్పినవన్నీ అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెడుతున్నానని అని తెలిపారు .
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పలువురి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలకు.. కూటమికి చెందిన పలువురు నేతలకు పచ్చ గడ్డి వేస్తే.. భగ్గుమన్న చందంగా మాటలు తూటాల్లో పేలుతున్నాయి. తాజాగా జనసేన నేత నాగబాబు వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటికి వైసీపీ నేతవంగా గీత కౌంటర్ ఇచ్చారు.
ఏపీలో పింఛన్ల ఇంటింటి పంపిణీకి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని తాజాగా ఈసీ ఆదేశించడం జరిగింది . ఫస్ట్ తారీకు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో పింఛన్ దారులలో టెన్షన్ మొదలవుతుంది .ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో గత నెలలో ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణి చేయడం కుదరలేదు .సచివాలయాలకు వెళ్లి తీసుకోవాల్సి వచ్చింది .
ఏపీ లో ప్రతి సాధారణ ఎన్నికలలో కులాలే విజయావకాశాలు శాసిస్తున్నాయని ,జనసేనాని పవన్ కళ్యాణ్ నినాదం అయిన బై బై వైసీపీ నిజం కావాలంటే కాపుల ఓట్లే కీలకమని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అన్నారు . ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేసారు . రాష్ట్రంలో ప్రస్తుతం 45శాతం బి.సి. లు ,18శాతం కాపులు, 16శాతం ఎస్.సి.లు, 6 శాతం ఎస్.టి.లు ,6శాతం రెడ్లు, 4శాతం కమ్మ 5శాతం యితరులు ఉన్నారని పేర్కొన్నారు
కోనసీమలో కొబ్బరి బొండం లో ఎంత తీపిగా ఉంటుందో రాజోలు నా జీవితంలో అంతటిది .రాష్ట్రము అంతా ఓడిపోయినా రాజోలు లో గెలిచి ఒక చిన్న వెలుగు నింపిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ..ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ రాజోలు లో పాల్గొని ప్రసంగించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చీకటిలో వెలుగు లాగా రాజోలు జనసేనకు విజయం అందించింది .
సీబీఐ మాజీ జేడీ ,జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మినారాయణ తన ప్రాణానికి ప్రమాదం ఉందని విశాఖ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. తాజా ఎన్నికల్లో జేడీ లక్ష్మినారాయణ జై భారత్ నేషనల్ పార్టీ తరుపున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.జేడీ లక్ష్మినారాయణ అసలు పేరు వాసగిరి వెంకట లక్ష్మినారాయణ కానీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా వున్నప్పుడు జగన్ ను ,గాలి జనార్దన్ రెడ్డి లను అరెస్ట్ చేయడం తో తన హోదా తో జేడీ లక్ష్మినారాయణ అనే పేరు బాగా పాపులర్ అయింది.
విశాఖ రైల్వే జోన్ వ్యవహారం మరో సారి తెరపైకి వచ్చింది .విభజన హామీలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనీ కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే .అయితే ఇప్పటి వరుకు దీనిపైనా ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు .ఈ క్రమం లో ఇటు కేంద్రం అటు రాష్ట్రం ఒకరు పై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి.