Home / క్రికెట్
ఇంగ్లండ్ క్రికెటర్ బెన్స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రపంచకప్ ట్రోఫీతో నిల్చున్న ఫొటోను షేర్ చేస్తూ తన రిటైర్మెంట్ను స్టోక్స్ ప్రకటించాడు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నానని డుర్హమ్లో దక్షిణాఫ్రికాతో చివరి వన్డే ఆడతానని తెలిపాడు.
భారత జట్టు మరోసారి సత్తాచాటింది. ఇంగ్లాండ్ సొంతగడ్డపై రోహిత్ సేన ఆధిపత్యాన్ని ప్రదర్శించి వన్డే సిరీస్ను సైతం కైవసం చేసుకుంది.ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 2-1 తేడాతో రోహిత్ సేన సిరీస్ కైవసం
లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో 100 పరుగుల తేడాతో భారత జట్టుపై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 247 పరుగుల లక్ష్యాన్ని భారత క్రికెట్ జట్టు చేదించలేకపోయింది.247 పరుగుల విజయ లక్ష్యంలో బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు 146 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లు వరుసగా ఔట్ అయ్యారు
లార్డ్స్ వేదికగా నేటి సాయంత్రం 5 గంటలకు భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని బావిస్తోంది. తొలి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్లో రాణించిన భారత్... ప్రత్యర్థిని 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది.
టీ20 సిరీస్ గెలిచి జోరు మీదున్న టీమిండియా తొలి వన్డేలోనూ దుమ్ము రేపింది. భారత బౌలర్లు బుల్లెట్ బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ భరతం పట్టారు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్తో చెలరేగాడు. ఏకంగా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకుని ఇంగ్లండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. మొహ్మద్ షమీ మూడు వికెట్లతో చెలరేగడంతో, తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్
టీ20 సిరీస్ గెలుపుతో ఉత్సహాంగా ఉన్న టీమిండియా వన్డే సిరీస్ కు సిద్దమవుతోంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ సాయంత్రం లండన్ లోని ఓవల్ మైదానంలో తొలి వన్డే జరగనుంది. వన్డే సిరీస్ ను కూడా గెలుచుకుని టూర్ ను విజయవంతంగా ముగించాలని టీమిండియా భావిస్తోంది.
చివరి టీ20లో ఓడిపోయిన టీమిండియాభారత్ , ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 216 పరుగుల భారీ టార్గెట్ కు 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీ చేసినా మిగతా వారి నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో పరాజయం తప్ప లేదు.
రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్ భారత్ కైవసం అయ్యింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 49 పరుగులతో గెలిచింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్. ముందుగా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా ఇవాళ భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండో టి20 జరగనుంది. సాయంత్రం 7గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టి20 గెలుపు ఉత్సహాంతో ఉన్న టీమిండియా సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతుంది.